Intinti Ramayanam Today Episode june 7th : పల్లవి పెట్టిన కేసును కొట్టేయించాలి అంటే మనం ఏం జరిగింది అన్నది పూర్తిగా తెలుసుకోవాలి అని శ్రీకర్ అనగానే అక్కడ చుట్టు పక్కల ఉన్న సీసిటీవీ కెమెరాలను పరిశీలిస్తారు.. అయితే రెండు, మూడు కెమెరా పు్టేజ్ ను చూసిన వాళ్లు అక్కడ ఏమి కనిపించలేదు అని అనుకుంటారు. చివరగా ఉన్న సుబ్బారావు ఇంటికి వెళ్తారు. అతన్ని పిలవగానే టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఏ పు్టేజ్ లేదు. మా కెమెరాలు పనిచెయ్యడం లేదని ఏదోక సాకు చెప్పి వెళ్లిపోండి అని ముఖం పై డోర్ వేస్తారు.. దాంతో అవనికి అనుమానం వస్తుంది.. ఏంటి సుబ్బారావు గారు ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు అని కమల్ ఎంతగా అడుగుతున్నా సరే మా సీసీటీవీ కెమెరా పని చేయడం లేదు. వీడియో లేదు ఏమీ లేదు వెళ్లిపోండి అని కంగారు పడిపోతూ అనడంతో అవని వాళ్లకి అనుమానం వస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారో మనం తెలుసుకుంటే అసలు మ్యాటర్ ఏంటో మనకి తెలిసిపోతుంది అని అవని అనుకుంటుంది.
సీసీటీవీ ఫుటేజ్ అనగానే ఈ సుబ్బారావు ఎందుకంత కంగారు పడ్డాడో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు.. అంటే కమల్ మాత్రం ఏదో జరుగుతుంది వదినా నాకు అనుమానం గాంధీ సుబ్బారావు మ్యాటర్ ఏంటో నేను తెలుసుకుంటాను అని అన్నాడు.. ఇదంతాఎవరో చేయించారా? మరి ఎందుకు అతను కంగారు పడ్డారు.. పల్లవి ఇదంతా చేయించిందా..? పల్లవి తన భర్త నెగ్గించడానికి కన్న తండ్రిని కూడా చంపాలి అనుకుంది. కచ్చితంగా తన తల్లిని తానే చంపాలనుకున్న అన్నది ఈ పుటేజ్ ను చూస్తేనే అర్థమవుతుంది అవని ఆలోచిస్తుంది. దీని వెనక ఎవరూ ఏదో చేస్తున్నారని అర్థం అయిపోయింది. కచ్చితంగా ఇంకా ఏదో జరుగుతుందని నాకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను..
పల్లవి నామీద కోపంతోనే తన తల్లిని చంపాలని అనుకుందేమో అని చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు లేంది రాజేశ్వరిపై ఇంత ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంది కదా.. ఖచ్చితంగా అది ప్రేమ కాదు అవినీ పై పగ తీర్చుకోవడానికి రాజేశ్వరిని నమ్మించి వాడుకుందేమో అని చక్రధర్ అనుమానిస్తూ ఉంటాడు. అవని ఆ సీసీ కెమెరాలు గురించి చెప్పడంతో చక్రధర్ కి అనుమానం ఇంకా బలంగా నాటుకుపోతుంది. ఇదంతా పల్లవిని చేయించి ఉంటుంది అని చక్రధర్అనుకుంటాడు.. కన్నతల్లిని పల్లవి ఎందుకు చంపాలనుకుంటుంది నాన్న ఏదో జరిగి ఉంటుంది పొరపాటు కూడా అవ్వచ్చు కదా అని అవని అంటుంది.. నాకు మాత్రం అలా అనిపించలేదు అమ్మ ఇదంతా కావాలని నిన్ను గాని మీనాక్షిని ఇరికించాలని చేసినట్లు ఉంది ఏదో జరుగుతుందని మాత్రం నాకు అర్థమవుతుంది అని చక్రధర్ అంటాడు.
పల్లవి అవని ఇరికిద్దమని అనుకుంటే ఆ మీనాక్షి వెళ్లి జైల్లో కూర్చుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ పనిని జీవితంలో కోలుకోకుండా చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. భానుమతి భోజనం చేయకుండా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు అని పల్లవిని అడుగుతుంది. మామ చనిపోయింది అన్న బాగా నన్ను గుండెల్ని పిండేస్తుంది నాకు ఆకలి కావట్లేదు అమ్మమ్మ అని పల్లవి అంటుంది. అందరూ పల్లవి నీ భోజనం చేయమని ఎంతగా బ్రతిమాలిన సరే తను మాత్రం నాకు ఆకలి కావడం లేదు అని అంటుంది. అవనికి తల్లిని దూరం చేశాను ఇక దాన్ని శాశ్వతంగా దూరం చేస్తే అవని చచ్చిపోతుంది ఆ ఇంటికి నేనే మహారాణి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది.
పల్లవి అవన్నీ ఎలా వెళుతుంటామని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బయట ఎవరూ ఆటోలో దిగినట్లు సౌండ్ వస్తుంది.. అది చూసి నా పల్లవి చక్రధర్ అవనీ లు ఎందుకు వస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది.. లగేజ్ తో ఇక్కడికొస్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడే ఉంటారని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా పల్లవి ఆగండి ఇది నా ఇల్లు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని అడుగుతుంది. ఇకమీదట నుంచి నేను మా నాన్న ఇక్కడే ఉండబోతున్నాము అని అవని అంటుంది. ఇది మా మామ్ ఇల్లు. మీ మామ్ ఏమి సంపాదించి కట్టించలేదు నేను కష్టపడి సంపాదించుకుని కట్టుకున్నాను అని చక్రధర్ అంటాడు.. నాకు కూడా హక్కు ఉంది. అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను అవని ఇకమీదట ఇక్కడే ఉంటాము అని చక్రధర్ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..