Sonam Wangchuk: లడఖ్ పర్యావరణ పరిరక్షణ, ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు ఒక ముఖ్యమైన లేఖ రాశారు. ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని, ప్రతికార చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలని ఆయన కోరారు.
ప్రభుత్వం గనుక ఈ రాతపూర్వక హామీ ఇస్తే, వెంటనే తాను నిర్వహిస్తున్న నిరాహార దీక్షను విరమిస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులను ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేలా ఒప్పిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం నుంచి అలాంటి సానుకూల స్పందన రాకపోతే తన అమరణ దీక్షను ఇలాగే కొనసాగిస్తానని వాంగ్చుక్ హెచ్చరించారు. విద్యార్థుల భద్రత, ప్రాంతీయ హక్కుల సాధనే ధ్యేయంగా సాగుతున్న ఈ ఉద్యమంలో కేంద్రం త్వరితగతిన స్పందించి సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
Also Read: ఏపీలో దేవుడికే రక్షణ లేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ యాంకర్ శ్యామల!