Intinti Ramayanam Today Episode November 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ నాకు సపోర్టుగా ఉన్నాడని లోపల సంతోష పడుతూ ఉంటుంది.. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అండి మీరు నాకు ఇప్పటికీ సపోర్టుగా ఉన్నారు. మా తమ్ముడు మా అమ్మని తీసుకుని వెళ్తానంటే వద్దు అని అన్నారు.. ఎక్కువగా మేము బాగా చూసుకుంటామని మా అమ్మకి సపోర్ట్ గా ఉన్నారు అని అవని భర్త పై ప్రశంసలు కురిపిస్తుంది. నేనేం చేయలేదు నువ్వు మా వాళ్లకోసం చేస్తున్న దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ నువ్వు గొప్పగా అనకు అని అక్షయ్ అంటాడు.. వీరిద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. కమల్ గదిలోకి వచ్చి పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. నువ్వు మా వదినని అవమానించేలా మాట్లాడావ్ అందుకు నీకు కచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి నేను గదిలో పడుకుంటాను నువ్వు బయట పడుకో అనేసి అంటాడు.. ఏంటి బావా నువ్వు? మీ వదినకి ఏమైతది దానికి నాకు పనిష్మెంట్ ఇస్తూ ఉంటావు నేను బయట పడుకోను గదిలోనే పడుకుంటాను అని అంటుంది.. ఇక పడుకోవాలంటే నీకు కొన్ని కండిషన్లు ఉన్నాయి… అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి తనకు అనుమానం జరిగిందన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తుంది. ఆవిడ ఎవరు నా కూతురు కొట్టడానికి ఈ విషయం గురించి మనం అక్కడికి వెళ్లి మాట్లాడాలి లేదా ఆవిడని ఇక్కడికి తీసుకురావాలి అని రాజేశ్వరి మొండి పట్టుపడుతుంది. అయితే చక్రధర్ ఇంకేమీ మాట్లాడలేక అవని ఇంటికి వెళ్లడానికి ఫిక్స్ అవుతాడు. పల్లవి తన తల్లిదండ్రులు తీసుకొని తన ఇంటికి వెళ్తుంది.. పార్వతి మీనాక్షితో మీరేం తప్పు చేయలేదు వదిన గారు మీరేం బాధపడకండి అని అంటుంది.. పల్లవి చక్రధర్ రావడం చూసి మీనాక్షి షాక్ అవుతుంది.. మా కూతురుని అక్కడే కొడితే నీకు తెలిసేది కాదు అందుకే ఇక్కడికి వచ్చి పడుతున్నానని పల్లవి చంప పగలగొడుతుంది రాజేశ్వరి. పల్లవి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉంటుంది.
అవినీకి తల్లి అంటే మీరు నాకు సొంత అక్క లాంటివారు. మిమ్మల్ని అవమానించదా నా కూతురు మాట్లాడింది దానికి నన్ను క్షమించండి. గారాబంగా తనని పెంచుకున్నాం తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు నన్ను క్షమించండి అని అడుగుతుంది. మామ్ ఏం చేస్తున్నావ్ నువ్వు? నిన్ను ఎందుకు తీసుకొచ్చాను నువ్వేం మాట్లాడుతున్నావ్ అని పల్లవి అడుగుతుంది. నువ్వు నోరు మూసుకో.. తల్లి లాంటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదా అని పల్లవి కే రివర్స్ గా చివాట్లు పెడుతుంది.. రాజేశ్వరి అవనికి తల్లి అంటే నాకు అక్కతో సమానం మీరు నన్ను క్షమించండి అని పదేపదే అడుగుతుంది.
మీనాక్షి మాత్రం రాజేశ్వరి మాటలకి కరిగిపోయి అయ్యో అదేం లేదండి పొరపాటున అలా జరిగింది అని అంటుంది. డాడ్ చూడండి మామ్ ఎలా మాట్లాడుతుందో కనీసం మీరైనా ఆవిడకి నా జోలికి రాకుండా బుద్ధి చెప్పండి అని అంటుంది. మీనాక్షి లాంటి గొప్ప వ్యక్తితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదా..? ఒక మనిషిని గౌరవించాలి పెద్ద చిన్న చూసుకొని మాట్లాడాలని నీకు ఎంత చెప్పినా అర్థం కాదా అని చక్రధర్ కూడా పల్లవికి షాక్ ఇస్తాడు.. దాంతో పల్లవికి ఏమవుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది..
అవని చక్రధర్ ని బయటికి తీసుకుని వెళ్లి ఇకమీదట నీ కూతురికి నువ్వు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేస్తే నా సంగతి తెలుసు కదా నీ గుట్టు బయటపెట్టి నీ అంతు తెలుస్తానని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఈ నిజం ఎవరికీ చెప్పొద్దు. ఒకవేళ నువ్వు చెప్పావనుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి ఏ నిజం గురించి అవన్నీ అడుగుతున్నారు అని అంటుంది. పల్లవి గురించి ఏదైనా జరిగితే నాకు నిజం చెప్పండి అని అవి నీకు చెప్తున్నాను అంతలోపే నువ్వు వచ్చావని కవర్ చేస్తాడు.
Also Read : అత్తకు ప్రభావతి కొత్త టీవీ.. కామాక్షి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ప్రభావతికి చెమటలు పట్టించిన సుశీల..
శ్రియ పల్లవి దగ్గరికి వచ్చి మీ నాన్నని ఎంతో ఆవేశంగా తీసుకుని వచ్చావు. కానీ మీ అమ్మానాన్న మాత్రం ఆ మీనాక్షిని సపోర్ట్ చేస్తూ నీకే దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చారు. మీ నాన్న మాట్లాడిన తీరని చూస్తే ఆ మీనాక్షికి మీ నాన్నకి ఏదో సంబంధం ఉందని నాకు అనుమానం వస్తుంది అని అంటుంది. అసలు ఆవిడ ఎవరు మీ నాన్నకి ఆమెకి ఉన్న పరిచయం ఏంటి అని అందరికీ డౌట్ వస్తుంది. ఆ మాట వినగానే మా నాన్నకి ఆవిడకి సంబంధం ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని పల్లవి అరుస్తుంది. శ్రీయ వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న అంత పాజిటివ్ గా మాట్లాడారు అంటే కచ్చితంగా ఆవిడకి మా నాన్నకి ఏదో సంబంధం ఉంది అని ఆలోచిస్తుంది. అదేంటో నేను తెలుసుకుంటానని పల్లవి అనుకుంటుంది.. అవని తన తల్లిని తీసుకొని గుడికి వెళుతుంది. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని మీనాక్షి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో చక్రధర్ గురించి పల్లవికి నిజం తెలుస్తుంది ఏమో చూడాలి..