Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ అయిందని ఆయనకు బాగానే ఉందని చెప్తారు. దీంతో మిస్సమ్మ, రాథోడ్ ఊపిరి పీల్చుకుంటారు. మనోహరి మాత్రం బయపడుతుంది. మరోవైపు ఇంట్లో ఉన్న పిల్లలు యాదమ్మ దగ్గరకు వెళ్లి రాథోడ్, మిస్సమ్మ కనిపించడం లేదని అడుగుతారు. దీంతో యాదమ్మ పిల్లలకు నిజం చెప్తుంది. పిల్లలు కంగారుపడుతూ తాము కొడైకెనాల్ వెళ్తామని చెప్తారు. దీంతో యాదమ్మ అవసరం లేదు బాబు ఇందాకే ఫోన్ చేశారు. నాన్నను తీసుకుని మిస్సమ్మ, రాథోడ్ వస్తున్నారంట కాసేపట్లో ఇంట్లో ఉంటామన్నారు అని చెప్తుండగానే.. బయట కారులో రాథోడ్, మిస్సమ్మ, అమర్ను తీసుకుని వస్తారు.
కారు సౌండ్ విని పిల్లలు అదిగో డాడ్ వాళ్లు వచ్చినట్టు ఉన్నారు అంటూ బయటకు పరుగెడతారు. బయట కారులోంచి అమర్ను కిందకు దించి స్ట్రెచర్ మీద కూర్చోబెట్టుకుని లోపలికి వస్తుంటారు మిస్సమ్మ, రాథోడ్. పిల్లలు ఎదురుగా వెళ్లి డాడ్ మీకేమైంది డాడ్ అంటూ పిలుస్తారు. అమర్ స్పృలో ఉండడు.. ఆనంద్ ఏడుస్తూ.. మిస్సమ్మ డాడ్ కు ఏమైంది..? కళ్లు తెరవడం లేదు.. అని అడుగుతాడు. బుజ్జమ్మ కూడా సార్ కళ్లు తెరవండి సార్.. మీకెలా యాక్సిడెంట్ అయింది సార్ అంటూ ఏమోషనల్ అవుతుంది. ఇంతలో మిస్సమ్మ పిల్లలు మీ డాడ్కు ఏమీ కాలేదు. మన అదృష్టం బాగుండి తలకు చిన్న గాయం మాత్రమే తగిలింది అని చెప్తుంది. దీంతో అంజు మరి డాడీ ఎందుకు కళ్లు తెరవడం లేదు. ఎందుకు మాతో మాట్లాడటం లేదు అంటూ అడగ్గానే..
రాథోడ్ బాధగా నొప్పి తగ్గడానికి డాడీకి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు అమ్మా అని చెప్పగానే.. ఆనంద్ బాధగా నిజంగా డాడీకి ఏమీ కాలేదు కదా మీరు అబద్దం చెప్పడం లేదు కదా అంటాడు. ఆకాష్ కూడా ఏడుస్తూ.. మీకు చాలాసార్లు ఫోన్ చేశాం.. రాథోడ్ ఫోన్ మీ ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. మేము చాలా టెన్షన్ పడ్డాం.. అంటూ ఏడుస్తుంటే.. మిస్సమ్మ పిల్లలు టెన్షన్ ఏమీ లేదు.. డాడీకి ఏమీ కాలేదు.. రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అంతే.. పదండి ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి అంటూ అందరూ కలిసి లోపలికి వెళ్తారు. మిస్సమ్మ పిల్లలు ఈ రెండు రోజులు మీరు డాడీని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు.. మీరు ఎగ్జామ్స్ మీద కాంసంట్రేషన్ చేయాలి అని చెప్పగానే.. అంజు ఏడుస్తూ.. డాడీకి ఇలా ఉంటే మేము ఎలా చదవగలం మిస్సమ్మ. మాకు కాంసట్రేషన్ ఎలా వస్తుంది అంటూ అడగ్గానే..
రాథోడ్.. డాడీకి ఏమీ కాలేదు అంజు పాప మత్తు ఇంజక్షన్ ప్రభావం తగ్గగానే కళ్లు తెరుస్తారు అంటూ చెప్తాడు. మిస్సమ్మ కూడా అవును అంజు డాడీని నేను చూసుకుంటాను.. మీరు మీ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి మీరు బాగా మార్కులు తెచ్చుకోవాలిన మీ డాడీ ఆశ అని చెప్పగానే.. ఆనంద్ ఓకే మిస్సమ్మ డాడ్ విష్ మాకు కూడా తెలుసు. మేము బాగా చదువుతాము.. అని చెప్పగానే.. ఆకాష్ ఏడుస్తూనే.. ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాము.. డాడీ త్వరగా కళ్లు తెరచి మాతో మాట్లాడాలి అంటాడు. దీంతో మిస్సమ్మ అలాగే డాడీ కళ్లు తెరవగానే.. ముందు మీకే చెప్తాను మీరు వెళ్లండి అంటూ చెప్తుంది.
ఇంతలో బుజ్జమ్మ, అమర్ చేయి పట్టుకుని మనసులో నాన్న అనుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మిస్సమ్మ గమనించి బుజ్జమ్మ నాన్నకు సార్కు ఏమీ కాలేదమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు.. సార్ కాసేపట్లో కళ్లు తెరచి మనందరితో మాట్లాడతారు. రాథోడ్ నువ్వు ఇక్కడే ఉండు నేను పిల్లలకు ఏమైనా తినిపించి వస్తాను రండి పిల్లలు అంటూ పిల్లలను తీసుకుని వెళ్లిపోతుంది మిస్సమ్మ. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.