Kissik talks on Nookaraju: జబర్దస్త్ (Jabardasth), శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi drama company) వంటి షోలతో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నూకరాజు (Nooka Raju). విభిన్నమైన గెటప్లతో ఆకట్టుకోవడమే కాకుండా తనదైన కామెడీ పంచ్ డైలాగ్ లతో అటు జడ్జెస్ ను కూడా మెప్పిస్తూ మరింత దూసుకుపోతున్నారు. అటు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో కిస్సిక్ టాక్స్ (Kissik talks)షోకి గెస్ట్ గా విచ్చేశారు. కిస్సిక్ టాక్స్ 69వ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో నూకరాజు ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు జరిగే పరిణామాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
వర్ష ఇటీవల జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తూ..” రీసెంట్గా ఏడుగురు వేటకు వెళ్ళిన వాళ్ళు చనిపోయారు” అని చెబుతుండగానే.. నూకరాజు మాట్లాడుతూ.. “ఈ సముద్రానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే .. మత్స్యకారులు చేపల వేట కోసం పది కిలోమీటర్లు లేదా 15 కిలోమీటర్లు సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు.. వాళ్లకి ఫోన్స్ ఉండవు. పడవ ఏదైనా చెడిపోయినా.. సముద్రంలో ఎటు పోతున్నారో తెలియదు. చలికి నరాలు పగిలిపోయి చనిపోయిన వారు కూడా ఉన్నాయి.
ఒకవేళ సముద్రంలో ఉండే పాములు పొరపాటున కాలికి కాటు వేస్తే.. అక్కడ కట్టు కట్టుకొని..వారి నోటితోనే మొత్తం ఆ విషాన్ని పీకేయాల్సి ఉంటుంది. సముద్రంలో వేటకు వెళ్లడం అంటే అంత ఆషామాషీ కాదు” అంటూ సముద్రంలోకి వేటకు వెళ్ళే మత్స్యకారుల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు నూకరాజు.
also read:‘క్రేజీ కళ్యాణం’ టీజర్.. కూతురి పెళ్లిగోల, దరిద్రమైన అల్లుడు రావాలని కొరే తండ్రి!
వర్ష మాట్లాడుతూ..” ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ అనే వ్యక్తి వస్తే సమస్య వస్తుందా? లేక సమస్యలన్నీ క్లియర్ అవుతాయా?” అని వర్షా ప్రశ్నించగా..”ఇద్దరి మధ్య సమస్యలు వచ్చేదే ఆ థర్డ్ పర్సన్ వల్ల” అంటూ నవ్వేశారు నూకరాజు ..”మద్యపానం.. ధూమపానం.. థర్డ్ పర్సన్”.. ఈ మూడు జీవితానికి హానికరమే అంటూ ఒక కొటేషన్ కూడా పంచుకున్నారు నూకరాజు.