Podarillu serials : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న లేటెస్ట్ సీరియల్ లలో ఒకటి పొదరిల్లు. గత ఏడాది డిసెంబర్ 22 న ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది.. డిఫరెంట్ స్టోరీ తో జనాల మధ్యలోకి వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోవడం మామూలు విషయం కాదు. ఇందులో నటించిన నటీనటులు అందరికీ సుపరిచితమే. డబ్బున్న వాళ్ళతో మద్దతురగతి కుటుంబంలోని అబ్బాయిలు పెట్టుకుంటే ఏమవుతుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ.. ఆ అబ్బాయిల పరిస్థితి ఎలా మారుతుంది అన్నది స్టోరీలో చూడాల్సిందే. ఈ సీరియల్లో బావ అంటే ప్రాణం ఇచ్చే మరదలు పాత్రలో గాయత్రీ నటించింది. ఆమె రియల్ లైఫ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గాయత్రి రియల్ లైఫ్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అందులో గాయత్రి పాత్రలో నటించిన ముద్దుగుమ్మ పేరు ప్రియాంక నాయుడు. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు నటించే సీరియల్స్ అన్నీ కూడా ఆమెకు మంచి పేరుని తీసుకొచ్చాయి. గతంలో వరుసగా సీరియల్స్ లో నటించిన ప్రియాంక ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో సీరియల్స్ కి కాస్త దూరమైంది.. మళ్లీ ఇన్నాళ్లకు పొదరిల్లు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇందులో ఈమె నటించినందుకు గాను ఈమెకు ఒక రోజుకి దాదాపూర్ 40 వేలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. మరి అసలు రెమ్యూనరేషన్ ఎంత అన్నది మాత్రం ఒక క్లారిటీ లేదు. ఒక రోజుకి 40 వేలు తీసుకుంటే ఆమె ప్రతిరోజు సీరియల్కు వెళుతుంది. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తుంది.
Also Read:గుణకు షాకిచ్చిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన శివ.. భయపడుతున్న శృతి…
స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అయిన వదినమ్మ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ తో పాటుగా స్టార్ మా లో మరికొన్ని సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటుగా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.. ప్రియాంక తనతో పాటు నటించినా మధు బాబుని ప్రేమించి పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికి పాప పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఒకటైనట్లు సోషల్ మీడియా లో ఆ మధ్య వార్తలు గుప్పుమన్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఇకపోతే ప్రస్తుతం ఈమె సీరియల్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. వరుసగా సీరియల్స్ ను చేస్తుంది.