Podarillu Mahalakshmi : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రోజు రోజుకి మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈమధ్య అన్నదమ్ముల ఎమోషనల్ సెంటిమెంట్ సీన్లతో జనాలను బాగా ఆకట్టుకుంది. అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి కళ్లకు కట్టినట్లు చూపించడంతో ఈ సీరియల్ చూసేందుకు ఎక్కువ మంది జనాలు ఇంట్రెస్ట్ చూపించారు.. దాంతో ఎక్కడ చివర్లో ఉన్నాయి సీరియల్ ఒక్కసారిగా టాప్ ప్లేసులోకి వచ్చేసింది.. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. మహాలక్ష్మి బ్యాగ్రౌండ్ గురించి అనేక వార్తలు వినిపించాయి. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈ మహాలక్ష్మి ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. నిజంగానే మహాలక్ష్మి ఈ సీరియల్ నుంచి తప్పకుండా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదిరిల్లు సీరియల్ రోజురోజుకి క్రేజ్ ని సంపాదించుకుంటూ టాప్ రేటింగ్లోకి వచ్చేసింది. గత ఏడది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఈ సీరియల్ లో హీరోయిన్ మహాలక్ష్మి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె అసలు పేరు కృతిక ఉమా శంకర్.. ఈమె కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం తెలుగులో నటిస్తుంది. మొదటగా మగువా ఓ మగువా సీరియల్లో నటించింది. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ లో నటిస్తుంది. ఈమెకు కన్నడలో సినిమా ఆఫర్స్ ఎక్కువగా రావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు పై ఈ హీరోయిన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పొదరిల్లు సీరియల్ డిఫరెంట్ గా ఉంటుంది. నలుగురు మగాళ్లు ఉన్న ఇంటికి ఒక ఆడపిల్ల కోడలుగా వెళ్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ.. అనుకోని పరిస్థితుల్లో కోడలుగా వెళ్ళిన ఆ అమ్మాయికి ఆ కుటుంబం ఎంతగా అండగా ఉంటుంది అన్నది స్టోరీ.. ఎటువంటి ఆధారం లేని ఒక ఆడపిల్లకి ఆ కుటుంబం ఇచ్చే ఆదరణ జనాలని బాగా ఆకట్టుకుంది. ఇక ఆ అమ్మాయి కూడా ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి అందరితో సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే.. మహాలక్ష్మి తనకు సర్టిఫికెట్లు వచ్చాయని చాలా సంతోషంగా ఉంటుంది. తాను ఎలాగైనా సరే ఉద్యోగాన్ని సంపాదించి తన ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటుంది. గాయత్రి మాధవ్ ని కలవడానికి ఇంటికి వస్తుంది. తన భర్తతో కలిసి మాధవ్ వాళ్ళ ఇంట్లో భోజనానికి వస్తానని మాట ఇస్తుంది. ఇవాళ్టి ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో చూడాలి..