E-Paper
Advertisement

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!
Advertisement

AP CID Raids: ఆంధ్రప్రదేశ్‌లో రేపోమాపో టీడీపీ సర్కార్ కొలువుదీరనుంది. జగన్ సర్కార్‌‌లో ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులపై దృష్టి పెట్టనుంది కొత్త ప్రభుత్వం. తాజాగా ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

గచ్చిబౌలి నానక్‌‌రామ్‌ గూడలోని ఆయన ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కీలకపత్రాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందు ఉండి నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

వైసీపీకి మద్దతుదారుడిగా పనిచేశారు. ముఖ్యంగా లిక్కర్ పాలసీలో ఆ పార్టీకి లబ్ది కలిగేలా చేశారని ఆయనపై ఫిర్యాదు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సీఐడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జే-బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర అని భావిస్తున్నారు.

Also Read: వైసీపీకి రావెల రాజీనామా, ఇదేబాటలో మరికొందరు..

Advertisement

2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం సర్వీసులు, పొరుగు రాష్ట్రాల నుంచి దాదాపు 10 నుంచి 15 మంది అధికారులను రప్పించుకుంది. ఆ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఆయా అధికారులు వ్యవహరించా రు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అప్పటి సీఎస్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయం తెలియగానే గవర్నర్ ఆదేశాలు జారీచేయడంతో అధికారులు ఆగిపోయారు. లెక్కలు తేల్చిన తర్వాతే ఇక్కడి నుంచి పంపించాలని రానున్న టీడీపీ సర్కార్ భావిస్తోంది.

Tags

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×