Bypoll Results: ఉపఎన్నికల ఫలితాలను కేవలం స్థానిక రాజకీయాలుగా చూడలేం. ఇవి ప్రజల మూడ్ను అంచనా వేసే పొలిటికల్ థర్మామీటర్స్. జెన్జీ దెబ్బ ఎలా ఉంటుందో నిన్నటి ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. చేతిలో ఉన్న సిట్టింగ్ సీట్లను కూడా కాపాడుకోలేకపోయింది కమలం పార్టీ. అసలైన మాస్టర్ స్ట్రోక్ తగిలింది మాత్రం బిహార్లోనే.. గత ఎన్నికల్లో కనీసం బోణి కొట్టలేక జీరోగా మిగిలిన ప్రశాంత్ కిశోర్.. నిన్నటి ఫలితాలతో ఒక్కసారిగా హీరోగా అవతరించారు. 30 ఏళ్ల బీజేపీ కుంచుకోటపై పీకే గెలుపు జెండా పాతేశారు. ఈ ఓటమి దశాబ్దాల కుల, మత, సెంటిమెంట్ రాజకీయాలపై పడిన కోలుకోలేని దెబ్బ. అసలే ఓటర్ల లిస్ట్లోకి కొత్త జెన్-జీ ఓటర్లు వచ్చేశారు. పాత రాజకీయ వ్యూహాలు ఇక పనిచేయవని జెన్-జీ ఓటర్లు ఈ తీర్పుతో తెగేసి చెప్పేశారు. మార్పు కోరుకునే యువత ఆలోచనలను గుర్తించకపోతే.. ఢిల్లీ దిగ్గజాలైనా బోల్తా పడక తప్పదు. బీజేపీకి ఈ ఫలితాలు హెచ్చరిక గంటలా…? ప్రశాంత్ కిషోర్కు కొత్త రాజకీయ ఆరంభమా? లేక ఇవన్నీ స్థానిక పరిస్థితుల ప్రభావమేనా?