Judicial Backlog: న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుంది సరే.. వ్యవస్థ కూడా సామాన్యుడి ఆర్తనాదాలను వినకుండా చెవులకు గంతలు కట్టుకుందా? బిహార్లో పాట్నా కోర్టు దీప్ రాయ్ని 34 ఏళ్లు జైల్లో ఉంచి చివరకు ముసలితనంలో నిర్దోషి అంటూ రిలీజ్ చేసింది. ఈ కేసులో చివరకు న్యాయం గెలవచ్చు. కానీ ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏ చట్టం తిరిగి ఇస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై పడిన బొగ్గుమచ్చను ఆయన చనిపోయిన తర్వాత న్యాయస్థానాలు చెరిపేశాయి.
ఈ రెండు కేసులే కాదు. దేశంలోని కోర్టుల్లో 5కోట్ల పెండింగ్ కేసులు మూలుగుతున్నాయి. అవి కోర్టుకు కాగితాలే కావచ్చు.. కానీ అవి మనుషుల జీవితాలు. ఒక్క సుప్రీంకోర్టులోనే ఈ ఏడాది నాటికి 92 వేలకు పైగా అపరిష్కృత కేసులు కొండలా పేరుకుపోయాయి. లోక్సభలో న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు ఆమోదం పడింది. సుప్రీం జడ్జీల సంఖ్య 38కి పెరగబోతుంది. మరి ఆ పెరిగిన సంఖ్య కేసుల కొండను కరిగిస్తుందా. రాజకీయ నేతల కుమ్ములాటలు, ఈడీలు, సీబీఐ కేసులు, ముందస్తు బెయిళ్లు, ఎన్నికల వివాదాలు… వీటికే కోర్టుల సమయం అంతా సరిపోతోంది.
Also Read: తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!
వీఐపీల కేసులకు రాత్రికి రాత్రే బెంచ్లు ఏర్పాటు చేసి గంటల తరబడి విచారణలు జరుపుతారు. మరి ఏ ఆధారం లేక, లాయర్లకు ఫీజులు ఇచ్చుకోలేక, కోర్టు గుమ్మం దగ్గర కన్నీళ్లతో నిలబడే సామాన్యుడికి ఆ సమయం ఎందుకు దక్కడం లేదు. పొలిటికల్ కేసుల ఒత్తిడిలో పేదవాడి న్యాయం నలిగిపోవాల్సిందేనా?
Also Read: అమ్మబాబోయ్.. మళ్లీ పెరగబోతున్న రీఛార్జ్ ధరలు.. ఏకంగా 15% టారిఫ్ హైక్!