Cauvery Dispute: దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశించినా ఫలితం లేదు. తమకే తాగు, సాగు నీటి ఇబ్బందులు ఉన్నాయంటూ.. కర్ణాటక రైతులు, కన్నడ సంఘాలు రోడ్డెక్కాయి. మరోవైపు తమిళనాడులో రైతులు ఇసుకలో కూరుకుపోయి వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. తమ పంటలను కాపాడుకునేందుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో కేంద్రం ఇప్పటికే కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని శాశ్వత సంస్థలుగా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీటి పంపిణీని ఈ సంస్థలే మానిటర్ చేస్తాయి. అయితే, ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన రాజకీయ, భావోద్వేగ అంశం కావడంతో కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయ్. వానాకాలం సీజన్ అయిపోయే లోపు.. కావేరీ నీరు తమిళనాడు బోర్డర్ క్రాస్ చేస్తుందా? కర్ణాటకలోనే ఉండిపోతుందా?