Student Protests: దేశ రాజకీయాల్లో సెన్సేషన్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే బ్యాక్గ్రౌండ్, విదేశీ చదువులకు ఖర్చుపై డీప్ డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఊపందుకున్న ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు.. ఆగస్ట్ 5న సీజేపీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఉద్యమాన్ని గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారు. ఇందుకోసం వ్యూహరచన చేస్తున్నారు. అయితే, ప్రధాని మోడీని టార్గెట్గా చేసుకొని సాగుతున్న ఈ పోరాటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. తన తల్లిని దూషించిన వారిని క్షమించేశానని మోడీ చెప్పారు. దాంతో రాజకీయం ఒక్కసారిగా సెంటిమెంట్ టర్న్ తీసుకుంది. దీనిని సీజేపీ, కాంగ్రెస్ తిప్పికొడుతూ విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్కు మోడీ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయ్. ప్రధాన్తో రాజీనామా చేయించడంలో సక్సెస్ అయి ఫుల్ జోష్లో ఉన్న సీజేపీ ఈ సెంటిమెంట్ రాజకీయాన్ని ఎలా ఎదుర్కోబోతోందనేది ఇంట్రస్టింగ్గా మారింది. భవిష్యత్ పోరాటాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయ్?