Karnataka Cabinet: కర్ణాటకలో అసమ్మతిని చల్లర్చడానికి మంత్రివర్గ విస్తరణ చేపడితే.. అది మరిన్ని రాజీనామాలు, తిరుగుబాట్లకు బాటలు వేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత హైకమాండ్ 20 మందితో కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ చివరి నిమిషంలో మాజీ సీఎం సిద్దరామయ్య ఎంటరవ్వడంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. తనకు చెప్పకుండా గాయత్రి శాంతేగౌడ పేరు చేర్చారంటూ అభ్యంతరం చెప్పడంతో 20 మంది ప్రమాణం కాస్తా, 19 మందికే పరిమితమైంది. ఇది కేవలం ఒక మంత్రి పదవి వివాదం కాదు.. సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య సాగుతున్న షాడో వార్. ఢిల్లీ హైకమాండ్కు డీకే శివకుమార్ ఎంత దగ్గరైనా రాష్ట్రాన్ని, సొంత శాసనసభాపక్షాన్ని శాసించేది మాత్రం సిద్ధరామాయ్యేనని ఈ ఒక్క ప్రమాణస్వీకారం నిరూపించింది. హైకమాండ్ ఇచ్చిన లిస్టులోనే ఒకరిని హోల్డ్లో పెట్టగలిగారంటే కర్ణాటకలో అధిష్టానం కంటే సిద్ధూ పవరే ఎక్కువని అనుకోవచ్చా? డీకే సర్కార్ స్పీడ్కు సిద్దు ఇంకెన్ని బ్రేకులు వేస్తారో.. ఇంకెన్ని గండాలు తేస్తారో.