E20 Petrol: ఈ-పెట్రోల్ మ్యాటర్ మళ్లీ హాట్ టాపికైంది. 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ను కలపడమే ఈ పెట్రోల్. ఈ ఫార్మూలా కాలుష్య నివారణకు పర్యావరణ పరిరక్షణకు ఎంతో యూజ్ఫుల్ పైగా విదేశీ దిగుమతల భారం కూడా తగ్గుతుందనేది. కేంద్ర ప్రభుత్వ వెర్షన్ అంతేకాదు ఇథనాల్ ఉత్పత్తిలో చెరుకు, మొక్క జొన్న రైతులకు కూడా ప్రయోజనం వుంటుందనేది కేంద్రం మాట. కానీ ఇది అన్ని వెహికల్స్కు వర్కవుట్ కాదు. ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గడం సహా వాహనాలు త్వరగా పాడవుతాయనే విమర్శలున్నాయి. ఇంతలోనే అగ్గికి ఆజ్యం పోసినట్టు ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో లాజిక్ లాగారు. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా ట్రేడ్ డీల్ కోసమే మోదీ సర్కార్ ఇథనాల్ బ్లెండింగ్ను బలవంతంగా రుద్దుతుందని ఆరోపించారాయన. ఏకంగా ప్రధాని ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ- పెట్రోల్ను బలవంతంగా రుద్దడం కాదు. దాంతో రెగ్యులర్గా వాడే పెట్రోల్ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలనేది కేజ్రీవాల్ డిమాండ్.