Nellore Mining: మైనింగ్ వార్… నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. దీనికి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తుండడంతోనే ఈ వ్యాపారం బయటకు వచ్చామన్నారు. అంతేకాదు.. అనిల్ వసూళ్లపై తమ దగ్గర ఆధారాలున్నాయనడంతో కథ మరో లెవెల్ కి వెళ్లింది. ఒకప్పుడు వైసీపీలోనే ఉన్న వేమిరెడ్డి.. 2024లో టీడీపీలోకి వెళ్లి నెల్లూరు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. నెల్లూరులో ఎవరి ప్రభావం ఎంత అన్న పోటీ మరింత కీలకంగా మారింది. ఈ డైలాగ్ వార్ అటు తిరిగి ఇటు తిరిగి లోకల్ వార్ దగ్గరికే వెళ్తోంది. మరి సింహపురిలో ఆధిపత్యం ఎవరిది?