Kuppam Politics: కుప్పంలో లోకల్ పాలిటిక్స్.. ఒక్కసారిగా హీట్ ఎక్కాయ్. వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయ్. చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండేవారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని.. రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తామనడం సంచలనంగా మారింది. దీంతో టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. భరత్ కామెంట్లు శాంతిభద్రతలకు సమస్యగా మారేలా ఉన్నాయని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు. నోటిఫికేషన్ రాక ముందే పరిస్థితి ఇలా ఉంటే.. నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నలున్నాయి. పార్టీలకు గెలుపు ముఖ్యం కావచ్చు.. కానీ గెలుపు కోసం హింసను ప్రోత్సహించడం కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది. లోకల్ వార్లో ఈ రప్పా.. రప్పా.. రక్తాభిషేకం రాజకీయానికి బ్రేక్ పడుతుందా?