MRPS Movement: 1994లో మొదలైన MRPS ఉద్యమం.. మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణ చుట్టూనే సాగింది. 2024లో సుప్రీంకోర్టు తీర్పుతో ఆ పోరాటానికి కీలక మలుపు వచ్చింది. కానీ మందకృష్ణ మాదిగ మాత్రం ఉద్యమాన్ని అక్కడితో ఆపడం లేదు. దేశంలో కుల వివక్ష ఇంకా కొనసాగుతోందని.. దళితులు ఉన్నత స్థానాలకు వెళ్లినా అవమానాలు తప్పడం లేదని చెబుతున్నారు. కుల, మత, వర్గ వివక్ష నిర్మూలనతో పాటు కొత్త సమాజ నిర్మాణమే లక్ష్యమని తాజాగా కొత్త పోరాట అజెండా ప్రకటించారు. అక్టోబర్ 7న అమరావతిలో జాతీయ సదస్సు నిర్వహించి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామంటున్నారు. ఇక పేదరిక నిర్మూలన కూడా కొత్త అజెండాలో కీలక అంశంగా మారుతోంది. అంటే ఇప్పటివరకు రిజర్వేషన్లో వాటా కోసం సాగిన పోరాటం.. ఇక సామాజిక గౌరవం, ఆర్థిక సమానత్వం, వివక్ష నిర్మూలన వైపు తీసుకెళ్తున్నారు. మరి మందకృష్ణ కొత్త నినాదం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది? రాజకీయ పార్టీలు దీన్ని ఎలా చూస్తాయ్?