Jana Sena: చేరికల కమిటీ ఉంది.. కానీ ఆపరేషన్ ఫెయిల్ అవుతోంది. ఇదే జనసేన ప్రాబ్లమ్. జనసేన బలపడాలి.. కొత్త నాయకత్వాన్ని పెంచాలి.. ఇతర పార్టీల నుంచి కీలక నేతలను తీసుకురావాలి. ఈ లక్ష్యంతోనే జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసింది జనసేన. కానీ కమిటీ ఏర్పాటై ఇంతకాలమైనా.. చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద చేరికలు మాత్రం కనిపించడం లేదు. పైగా ఉత్తరాంధ్రలో జనసేనకు ప్లస్ అవుతారని ప్రచారం జరిగిన నాయకులు.. ఇప్పుడు టీడీపీ వైపు వెళ్లడం చర్చగా మారింది. చిన్న శ్రీను ఎపిసోడ్ ఇందుకు నిదర్శనం. నిజానికి నాయకులు జనసేన వైపు వెళ్తుంటే.. చివరి నిమిషంలో టీడీపీ టేకోవర్ చేస్తోందా అన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో నడుస్తోంది. మరి జనసేనలో టైమింగ్ లేదా.. స్ట్రాటజీ మిస్ అవుతోందా? కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇది చిన్న విషయం కాదు. చిన్న శ్రీను ఎపిసోడ్ తర్వాత జనసేన అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చిందా?