Balochistan vs Pakistan: పాకిస్థాన్లో మరోసారి అశాంతి నెలకొంది. బలోచిస్తాన్ ఆర్మీ మళ్లీ రెచ్చిపోయింది. క్వైట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని టార్గెట్ గా చేసుకొని దాడికి పాల్పడింది. నసీరాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పైన ట్రైన్ నడుస్తున్న క్రమంలో దాడి జరిపారు. అంతే కాకుండా ట్రైన్ పై రాకెట్లతో దాడి చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘనాస్థలికిక చేరుకున్న భద్రతా బలగాలు పరిసరాలను చుట్టుముట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద కారణంగా ఆ ప్రాంతంలో రైలు రవాణా నిలిచిపోయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.