E-Paper
Advertisement

Fire Accident: SVS కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Fire Accident: SVS కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Advertisement

Fire Accident:  అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న SVS కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని రియాక్టర్లు ఒక్కసారిగి పేలడంతో మంటలు భారీస్థాయిలో ఎగసిపడ్డాయి. ఈ ప్రమాద ధాటికి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. రియాక్టర్లు పేలిన అనంతరం అక్కడే నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ డ్రమ్ములు వరుసగా పేలడం ప్రారంభించాయి. ఆయిల్ డ్రమ్ములు పేలుతుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు ఉధృత్తికి ఫ్యాక్టరీ పైకప్పులు, యంత్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ ప్రమాద సమాాచారం అందిన వెంటనే 6 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో చిక్కుకున్న 16 మంది కార్మికులను ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పరడాల డీఎస్పీ విష్ణు స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 16 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారని.. మంటలు ఆర్పే ప్రక్రియ కొనసాగుతోందని.. ఆస్తి నష్టం ఎంత అనే దానిపై అంచనా వేస్తున్నామని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్నీ కోణాలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. గాలిలో కెమికల్ పొగలు వ్యాపించిడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

ALSO READ: Hyderabad News: ఏటీఎంలో హెల్ప్ చేస్తారు.. కార్డులు మార్చేసి దోచేస్తారు, నగరంలో కొత్త దందా!

 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×