విజయసాయి ఆరోపణలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అయితే.. ఆయనకు మరింత ప్రచారం వస్తుందన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైలెంట్ స్ట్రాటజీతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి సజ్జల మాత్రం విజయసాయి ఆరోపణలకు నేరుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో కోటరీ లేదని.. జగన్ ఒక్కరే పార్టీకి నాయకుడని స్పష్టం చేశారు. మరి విజయసాయి ప్రస్తావించిన ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాలా? లేక పట్టించుకోకుండా వదిలేయడమే రాజకీయంగా సేఫ్ గేమా? అన్న టాక్ అయితే నడుస్తోంది.
బొత్స చేసిన కేఏ పాల్-2 సెటైర్ కూడా ఇదే వ్యూహంలో భాగమా? విజయసాయి చెబుతున్న అంశాలపై చర్చిస్తే వైసీపీకే నష్టం జరుగుతుందన్న భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లుగా ప్రచారమైతే జరుగుతోంది. అయితే ఇలాగే సైలెంట్ గా ఉంటే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న టాక్ కూడా ఉంది. ఓవరాల్ గా చూస్తే విజయసాయి ట్రాప్లో పడకూడదన్న ఉద్దేశమే ఫ్యాన్ పార్టీలో కనిపిస్తోంది.