సొంత పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి నిజామాబాద్కు వచ్చిన కవిత.. పాంచజన్యం సభలో బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. తనను పార్టీ కోసం జైలుకు పంపారని చెప్పిన నేతలే.. చివరకు పార్టీ నుంచి బయటకు పంపించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే కన్నీటితో ఆగకుండా.. తాను పిరికిదాన్ని కాదంటూ అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభలో కవిత సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా మార్మోగాయ్.
ఇక కవిత టార్గెట్ చేసిన మరో పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ హామీలను ఎండగడతామంటూ ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలను నియమించి కాంగ్రెస్ ను కడిగేస్తామని ప్రకటించారు. అంటే.. కవిత పార్టీ ఇప్పుడు భావోద్వేగ రాజకీయాల నుంచి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు వెళ్తుందా? బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అవుతామని చెబుతున్న కవిత.. ముందుగా సొంత జిల్లాలోనే బలమైన పునాది వేయగలరా? కన్నీటి సెంటిమెంట్ ఓట్లుగా మారుతుందా? నిజామాబాద్ నుంచి మొదలైన కవిత పొలిటికల్ కౌంటర్ తెలంగాణ అంతటా విస్తరిస్తుందా? ఇవన్నీ బిగ్ డిబేట్.