Telangana Assembly: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ముందే సమరభేరి మోగించింది. ఇవాళ బ్లాక్ టీషర్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బనియన్లతో సభలోకి వెళ్లాలనుకున్న హరీశ్రావుతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. బనియన్లతో ఎవరైనా సభలోకి వెళ్తారా అన్న ప్రశ్నలు వచ్చాయ్. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసుల వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అదే సమయంలో బీజేపీ కూడా సభలో ఆందోళనకు దిగింది. ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలు సభను పొలిటికల్ స్టేజ్గా మార్చుతున్నాయని ఫైర్ అయింది.
ఒకవైపు బయట అంత పొలిటికల్ హీట్ ఉండగా.. తాతా మధు ఎపిసోడ్ మరింత వేడెక్కించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఇష్యూపై సీఎం రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు. మిగితా కాంగ్రెస్ సభ్యులు కూడా కేసీఆర్ ను, బీఆర్ఎస్ తీరును కడిగి పారేశారు. తాతా మధుపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే తాతా మధు మాత్రం తాను స్పీకర్ను అవమానించలేదంటున్నారు. నిరసనకు హక్కుంది. కానీ సభ గౌరవం సంగతేంటి?