Rice Scam: తెలంగాణ సర్కార్ అర్హులైన పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకోసం రైతుల నుంచి ఐకేపీ కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అప్పగిస్తున్నారు. ఒప్పందం ప్రకారం రైస్ మిల్లర్లు వడ్లను ప్రాసెస్ చేయాలి.
వంద కేజీల వడ్లకు 67 కేజీల సన్నబియ్యం ఇవ్వాలి. కొన్ని రోజులు లెక్క ప్రకారమే జరిగింది. కానీ రైస్మిల్లుల నుంచి సన్న బియ్యం సరఫరాకు బ్రేక్ పడింది. తెలంగాణ వ్యాప్తంగా 2 వేల 3 వందల 88 రైసు మిల్లుల నుంచి దాదాపు 4వేల 235 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ రాలేదు.ఎందుకు? కారణాలేంటని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన ఎంక్వైరీలో సన్న బియ్యం వెనుక పెద్ద దగానే బయటపడింది. ప్రభుత్వం నుంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొని ప్రాసెస్ చేసి సన్న బియ్యాన్ని బ్లాక్మార్కెట్ చేస్తున్నట్లు తేలింది. విజిలెన్స్ రెయిడ్స్లో నిజాలు బయటపడ్డంతో క్రిమినల్ కేసులు తప్పవని రైస్ మిల్లర్ల గుండెలు గుబేల్మంటున్నాయి.
Also Read: ఇన్స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!