Viral Video: బిహార్ లోని గయా జిల్లాలో ఆశ్చర్యకర రీతిలో ప్రమాదం చోటు చేసుకుంది. పహర్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలు ప్రత్యక్షంగా ఢీకొట్టనప్పటికీ ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో పట్టాల పక్కనే ఉన్న చెక్క దుంగ ఎగిరొచ్చి మహిళను బలంగా తాకింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వైరల్ వీడియోను గమనిస్తే.. స్టేషన్ లోని రెండు రైల్వే ట్రాక్ లకు మధ్య ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున కట్టెలు పెట్టి ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్లాట్ ఫామ్ మీద నుంచి పట్టాలపైకి వచ్చిన మహిళ.. అవతలి వైపున ఉన్న ఫ్టాట్ ఫామ్ మీదకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో రెండో ఫ్లాట్ ఫామ్ మీద రైలు వెళ్తుండటంతో కొద్దిసేపు ట్రాకుల మధ్య ఉన్న గ్యాప్ లో నిలబడింది. తర్వాత ఆ రైలు వెళ్లిపోవడంతో బాధితురాలు ముందుకు కదిలింది.
Wooden logs placed on the railway tracks were struck by a high-speed train in Paharpur, Bihar 😳
One log flung toward a woman standing nearby, leaving her seriously injured 😨 https://t.co/WeftD3Du5B
— News Algebra (@NewsAlgebraIND) February 5, 2026
బాధితురాలు రెండో నెంబర్ ట్రాక్ గుండా ఫ్లాట్ ఫామ్ వద్దకు వెళ్తున్న క్రమంలోనే మెుదటి ట్రాక్ మీదకి రైలు దూసుకొచ్చింది. ఈ క్రమంలో ట్రాక్ కు ఆనుకొని చెక్క దుంగలు పెట్టడంతో రైలు వాటిని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులోని ఒక దుంగ ఎగిరొచ్చి.. అవతలి ట్రాక్ మీద ఉన్న బాధితురాలిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అమాంతం గాల్లోకి ఎగిరి కిందపడిపోయింది. ఈ దృశ్యాలు చూసి స్టేషన్ లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తలకు బలమైన గాయం అయ్యిందని.. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద వీడియోను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విచిత్రమైన ప్రమాదాన్ని తామెప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు. రైల్వే ట్రాక్ మధ్యలో అలా దుంగలు పెట్టడాన్ని పలువురు ప్రశ్నించారు. రైల్వే సిబ్బంది అలా ఎలా వదిలేశారని నిలదీశారు. మరికొందరు మాత్రం ఈ ప్రమాదంలో మహిళ తప్పు కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్లాట్ ఫామ్ వంతెనను వినియోగించకుండా నేరుగా పట్టాల మీద నుంచి దాటి వెళ్లడం ప్రమాదకరమని పేర్కొంటున్నారు.
Also Read: Viral Video: పార్సిల్ డెలివరీకి.. బైక్ బుక్ చేసిన మహిళ.. బాక్స్లోది చూసి అవాక్కైన రైడర్!