E-Paper
Advertisement

Job Security: ప్రభుత్వ ఉద్యోగమా లేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా.. ఏది బెటర్?

Job Security: ప్రభుత్వ ఉద్యోగమా లేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా.. ఏది బెటర్?
Advertisement

Job Security| ఇటీవల సోషల్ మీడియాలో కొత్తగా డిబేట్ ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాత్రి పగలనకు కృషి చేస్తున్నవారిని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విమర్శిస్తుంటే.. మరోవైపు ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత లేదని అందరూ వేలెత్తి చూపుతున్నారు. ఈ చర్చ ప్రారంభానికి కారణం ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడమే. ఏడాది కాలంగా చూస్తే మెటా, గూగుల్, అమెజాన్ లాంటి ఐటి దిగ్గజాలు ఉద్యోగాల్లో కోత విధించగా.. ఇటీవలే తెలుగు తేజం సత్య నాదెళ్ల నేతృత్వంలోని దిగ్గజ మైక్రోసాఫ్ సంస్థ కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత, వేతనం దృష్ట్యా ఐటీ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలను పోల్చడంపై చర్చ జరుగుతోంది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఒక యువకుడు ఉద్యోగం కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటున్నాడని అతని సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ పై స్పందిస్తూ. . గూగుల్ కంపెనీలు టెక్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఒక యువకుడు చేసిన కామెంట్ వైరల్‌గా మారింది.

Advertisement

మైక్రోసాఫ్ట్‌లో జరిగిన ఉద్యోగ తొలగింపుల సందర్భంగా స్నేహ అనే మహిళ ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ‘అమెరికాలో పనిచేస్తున్న నా కజిన్ బ్రదర్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. టెక్ రంగం అనేది స్థిరత్వం ఉండే రంగం కాదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, కనీసం అక్కడైనా ఉద్యోగ భద్రత ఉంటుందని మా పెద్దలు చెబుతుంటారు’ అని ఆమె రాసింది.

అయితే స్నేహ చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ.. బెంగళూరుకు చెందిన గూగుల్ ఇంజినీర్ రాహుల్ రాణా సమాధానం ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనను ఖండించాడు. టెక్ పరిశ్రమలో పనిచేసే వారి వేతనం ప్రభుత్వ ఉద్యోగం కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎత్తి చూపాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగ భద్రత ప్రయోజనాల కంటే అధిక ఆదాయం ద్వారా కలిగే ప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలని వాదించాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాలంలో సంపాదించే మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ సొమ్మును ఒక టెక్ ఉద్యోగి కేవలం కొన్ని సంవత్సరాల్లోనే సంపాదించగలడని ఆయన పేర్కొన్నాడు.

Advertisement

Also Read: సరదా కోసం సింహాన్నిపెంచుకున్న వ్యక్తి.. ఇంట్లో అంతా రక్తపాతం

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మరికొంతమంది యూజర్లు కూడా దీనిపై స్పందించారు. టెక్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల మధ్య లాభనష్టాలను విశ్లేషిస్తూ.. ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్ స్థిరత్వంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తన వాదనను మరింత బలపరుస్తూ.. స్నేహ మళ్లీ ట్వీట్ చేసింది. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు వేతనానికి మించిన గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయని, గృహ నిర్మాణం, విద్యుత్, ఇతర సౌకర్యాల కోసం అలవెన్సులతో సహా, ఇవి గణనీయమైన సంపద సేకరణకు దోహదపడతాయని వివరించింది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×