Safilguda Incident: సఫిల్ గూడలోని కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ఉదయం నుంచి సఫిల్గూడ కట్ట మైసమ్మ గుడి వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో.. సఫిల్గూడ నుంచి నేరేడ్మెంట్ వెళ్లే రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో ఈ అరచానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన అల్తాఫ్గా గుర్తించారు.
అంతేకాకుండా నేరెడ్మెట్ ప్రాంతంలో రోజు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. అయితే అతడు మత విశ్వాసాలను అవమానించాడంటూ 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు పోలీసులు. అలాగే అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు..
ఈ ఘటనపై స్పందించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. రాష్ట్రంలో ఆలయాలపై, హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతన్నాయని అన్నారు. ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు రాంచందర్ రావు.
Also Read: తిరుమల తిరుపతి తాగునీటి సమస్యకు చెక్.. త్వరలో వెంకన్న పాదాలను తాకనున్న కృష్ణమ్మ..
అంతేకాకుండా సఫిల్గూడ ఆలయ ఘటనపై ఫైరయ్యారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్. హిందూ ఆలయం ముందు ఇలా చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మత ఘర్షణలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అతడి వెనుక ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? అనేది పోలీసులు బహిర్గతం చేయాలన్నారు చీకోటి ప్రవీణ్.
సఫిల్గూడ కట్టమైసమ్మ ఘటన నిందితుడిని గుర్తించిన పోలీసులు
నిందితుడు కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన అల్తాఫ్గా గుర్తింపు
నేరెడ్మెట్ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం
అల్తాఫ్పై 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసులు నమోదు
అల్తాఫ్కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు https://t.co/GtL81kwRrP pic.twitter.com/XIp42H6Qs6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2026
కట్ట మైసమ్మ గుడి వివాదంపై స్పందించిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు
బొడ్రాయిపై ఓ ముస్లిం వ్యక్తి మూత్రం పోయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న రామచంద్రరావు
ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు
ఇటువంటి వ్యక్తులపై ప్రభుత్వం కఠినంగా చర్యలు… https://t.co/GtL81kwRrP pic.twitter.com/x2CUhhe9ST
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2026