E-Paper
Advertisement

లైకుల పిచ్చి.. పోలీస్ వాహనం ముందే బైక్ స్టంట్లు.. చివరకు ఏమైందంటే?

లైకుల పిచ్చి.. పోలీస్ వాహనం ముందే బైక్ స్టంట్లు.. చివరకు ఏమైందంటే?
Advertisement

Bike Stunts: నేటి యువతకు సోషల్ మీడియా పిచ్చి తలకెక్కి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. కేవలం కొన్ని ‘లైకులు’, ‘వ్యూస్’ కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని కొత్వాలి సర్కిల్ ప్రాంతంలో అశు అనే యువకుడు చేసిన సాహసం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఏకంగా పోలీసు వాహనం ముందే స్టంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జిగ్‌జాగ్ డ్రైవింగ్.. హ్యాండిల్ వదిలేసి స్టంట్లు!
సాధారణంగా ఎవరైనా పోలీసులను చూస్తే క్రమశిక్షణగా వెళ్తారు. కానీ, అశు అనే ఈ యువకుడు మాత్రం తన బైక్‌పై అత్యంత ప్రమాదకరమైన రీతిలో విన్యాసాలు చేశాడు. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాల మధ్య జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేస్తూ అందరినీ హడలెత్తించాడు. అంతటితో ఆగకుండా, బైక్ హ్యాండిల్ వదిలేసి సీటుపై నిలబడి ప్రయాణించడం చూస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

ఖైదీల వ్యాన్ ముందే స్టంట్లు..
ఈ ఘటనలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు అశు ఈ విన్యాసాలన్నీ పోలీసు వాహనం ముందే చేయడం. చట్టాన్ని ఏమాత్రం గౌరవించకుండా, పోలీసుల ముందే రీల్స్ కోసం ఇంతటి సాహసానికి ఒడిగట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన బైక్ స్పీడును నియంత్రించకుండా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కెమెరాకు పోజులిస్తూ అతను చేసిన పని పోలీసు శాఖకు సవాల్‌గా మారింది.

వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు
సదరు యువకుడు తన సాహసాలను వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించారు. వీడియో ఆధారంగా నిందితుడి వాహన నంబర్‌ను గుర్తించిన కొత్వాలి పోలీసులు, అతడిని అశుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Also Read: కూతురు ఇంటికి తిరిగొస్తే ఏ తండ్రికైనా పండుగే.. డప్పు చప్పుళ్లతో విడాకుల సెలబ్రేషన్స్

వైరల్ పిచ్చి వద్దు.. ప్రాణం ముఖ్యం!
ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతలా ఉందో మరోసారి స్పష్టం చేస్తోంది. వర్చువల్ ప్రపంచంలో గుర్తింపు కోసం వాస్తవ ప్రపంచంలో ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల మన ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే అమాయక ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. పోలీసులు కూడా ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×