Indian Restaurant Closure: పాక్ పౌరుల వేధింపులు తాళలేక లండన్ లోని భారత రెస్టారెంట్ మూతపడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రెస్టారెంటు యజమాని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆన్ లైన్ పాక్ పౌరుల వేధింపులు ఎక్కువ కావడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. 16 ఏళ్లుగా తమకు అండగా నిలిచిన కస్టమర్లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
భారత సంతతి వ్యక్తి హర్మాన్ సింగ్ కపూర్ ఏర్పాటు చేసిన రంగ్రెజ్ రెస్టారెంట్ గత 16 ఏళ్లుగా అక్కడి పౌరులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ వచ్చింది. అయితే హర్మాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ షాకింగ్ ప్రకటన చేశారు. పెరుగుతున్న ఖర్చులు, స్థానిక అధికారుల మద్దతు లేకపోవడం, ఆన్ లైన్ వేధింపులు, కొన్ని సమూహాల ప్రత్యక్ష బెదిరింపులు కారణంగా రెస్టారెంట్ నిర్వహణ అసాధ్యంగా మారిపోయిందని వాపోయారు. కాబట్టి రెస్టారెంట్ ను మూసివేయాలన్న కఠిన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి రంగ్రెజ్ రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
After 16 unforgettable years, I’ve made the difficult decision to close Rangrez restaurant Hammersmith next month.
Rising costs, ongoing online harassment, repeated disturbances and attacks by Pakistanis and a lack of proper support from the Met Police have made it impossible to… pic.twitter.com/FvlUWNAj0y
— Harman Singh Kapoor (@kingkapoor72) February 23, 2026
లండన్ లోని పాకిస్థానీలు తన రెస్టారెంట్ నిర్వహణకు పదే పదే ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్నారని యజమాని హర్మాన్ సింగ్ కపూర్ వాపోయారు. ఆన్ లైన్ లో వేధించడంతో పాటు ప్రత్యక్ష దాడులకు సైతం తెగబడినట్లు ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. దీనిపై స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యల లేకుండా పోయాయని తెలిపారు. వారి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆరోపించారు. కాబట్టి ఇక రెస్టారెంట్ ను నిర్వహించలేమన్న అభిప్రాయానికి తాను వచ్చేసినట్లు తెలియజేశారు.
Also Read: Viral Video: రైలులో చిప్స్ పారేసిన 2 ఏళ్ల కొడుకు.. తండ్రి చేసిన పనికి.. నెట్టింట ప్రశంసలు!
లండన్ లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్ గా పేరున్న రంగ్రెజ్ ను మూసివేయడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. తాను రంగ్రెజ్ రెస్టారెంట్ ను గతంలో సందర్శించానని.. వారి ఆతిథ్యం, ఆహారం చాలా బాగా అనిపించిందని చెప్పారు. మరి స్థానికులు తప్పుడు రివ్యూలు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. పాక్ పౌరుల కుట్రగా అతడు అభివర్ణించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ తనకు రెస్టారెంట్ వ్యాపారం ఉందని.. పెరుగుతున్న ఖర్చులను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఇంకొక నెటిజన్ స్పందిస్తూ.. మీ విషయంలో జరిగిందని అన్యాయమని పేర్కొన్నారు.
Also Read: Upcoming ACs march 2026: మార్చిలో రాబోతున్న.. మోస్ట్ వాంటెడ్ ఏసీలు.. మిడిల్ క్లాస్కు పండుగే!