Mandi Biryani Offer: జిస్మత్ అరేబియన్ మండి. మండి లవర్స్ కు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెస్టారెంట్ కు బ్రాంచీలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, గౌలిదొడ్డిలోని జిస్మత్ మండిలు బాగా ఫేమస్. తాజాగా ఈ రెస్టారెంట్ ను గుంటూరులోనూ ఏర్పాటు చేశారు. లాంచింగ్ సందర్భంగా వాళ్లు ఓ క్రేజీ ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ పేరు Jతో మొదలైనట్టే, J అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వాళ్లందరికీ మినీ చికెన్ మండి ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
గుంటూరు ప్రజలకు ఈ ఆఫర్ డిసెంబర్ 20 వరకు అందుబాటులో ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వైరల్ న్యూస్ లో నిజం ఎంత అనేది మాత్రం ఎవరూ క్లియర్ గా చెప్పడం లేదు. కానీ, ఈ పేరు ఉన్న వాళ్లు రెస్టారెంట్ కు వెళ్లి ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే, అక్కడికి వెళ్లే ముందు నిజమో కాదో తెలుసుకోవడం మంచిదంటున్నారు.
Read Also: డేంజర్ స్టంట్.. పైకి పోవాలని అంత తొందర ఏంట్రా నీకు?
జిస్మత్ సాధారణంగా ఎక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేసినా, ఓపెనింగ్ ఆఫర్ లో భాగంగా ఫ్రీగా బిర్యానీ ఇస్తుంది. అందులో భాగంగానే గుంటూరులోనూ ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీ పేరు Jతో మొదలైతే, ఈ ఆఫర్ ను ట్రై చేయండి. ఎందుకంటే, ఈ ఆఫర్ ఈ నెల 20 వరకే అందుబాటులో ఉంది. హ్యాపీగా ఫ్రీ చికెన్ మండితో పాటు అక్కడి మండీలో దొరికే ఇతర అరేబియన్ ఫుడ్ కూడా హ్యాపీగా టేస్టీ చేయండి. మీతో, పాటు మీ ఫ్రెండ్స్ కు కూడా ఓసారి టేస్టీ చూపించండి. ఒక్కసారి మండిని ఇష్టపడితే, చాలా మంది మళ్లీ వదలరనే టాక్ కూడా ఉందండోయ్!
Read Also: పిల్లాడిని తలకిందులుగా పట్టుకుని దిష్టి, చివరికి..