Sircilla Crime: సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ టీచర్ చిన్నారిపై చూపిన అమానుషం నిజంగా గుండెను కలిచివేసే ఘటన. అక్షరాలు నేర్పించాల్సిన చేతులే.. అభం శుభం తెలియని మూడేళ్ల బాలుడిపై ప్రతాపం చూపడం విద్యావ్యవస్థలోని లోపాలను, కొందరు సిబ్బందిలోని క్రూరత్వాన్ని ఎత్తిచూపుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్వగ్రామానికి చెందిన విజయకుమార్, లక్ష్మి దంపతుల కుమారుడు విద్వాన్ (3) స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. ఎప్పటిలాగే కేంద్రానికి వెళ్లిన బాలుడిని.. అక్కడి టీచర్ ఎటువంటి కారణం లేకుండా విచక్షణారహితంగా కొట్టింది.
చిన్నారి విద్వాన్ శరీరంపై గాయాలను చూసిన తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. టీచర్ బాలుడిని ఎంత దారుణంగా కొట్టిందంటే.. చిన్నారి కన్ను వాచిపోవడంతో పాటు.. చేతులు , వీపుపై వాతలు తేలాయి. కనీసం ఏం జరిగిందో కూడా చెప్పుకోలేని ఆ చిన్నారిని అలా గాయపరిచిన తీరు చూసి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు పరిస్థితి చూసి తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరు కావడం అందరినీ కలచివేసింది.
చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ , ఐసిడిఎస్ (ICDS) అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. సదరు అంగన్వాడీ టీచర్ను వెంటనే విధుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఎప్స్టీన్ ఫైల్స్లో అనిల్ అంబానీ.. ఇంకా పెద్దపెద్దోళ్లు, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
అమానుషం.. చిన్నారిని చితకబాదిన అంగన్వాడీ టీచర్
రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో అంగన్వాడీ టీచర్ దారుణానికి ఒడిగట్టింది. విధ్వాన్స్ అనే చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టడంతో బాలుడి కన్ను, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. శరీరంపై వాతలు తేలేలా టీచర్ దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర… pic.twitter.com/POZ99BpXez
— ChotaNews App (@ChotaNewsApp) February 11, 2026