Tirumala Tallest Woman: తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల మంది దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. తిరుమలలో వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు ఏడు అడుగుల ఎత్తైన మహిళ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె ఎవరని భక్తులు ఆరా తీయగా.. శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం అని తెలిసింది.
ఆలయ ప్రాంగణంలో ఏడు అడుగుల ఎత్తున్న మహిళ భక్తుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. ఆమెను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. శ్రీలంకకు చెందిన మాజీ నెట్బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం సోమవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి భక్త బృందంతో కలిసి ఆమె తిరుమలకు వచ్చారు. ఏడు అడుగుల ఎత్తుతో ఉన్న ఆమెను ఆలయ పరిసరాల్లో చూసిన భక్తులు కాసింత ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది ఆమె వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆలయ పరిసరాల్లో కాసేపు సందడి వాతావరణం కనిపించింది.
బాబోయ్ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి
తిరుమలలోవానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు ఏడు అడుగుల ఎత్తైన మహిళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. శ్రీలంకకు చెందిన నెట్… pic.twitter.com/WJOakJL8LD
— ChotaNews App (@ChotaNewsApp) November 3, 2025
Also Read: CM Chandrababu: ఏపీలో హిందుజా భారీ పెట్టుబడులు.. రూ. 20,000 కోట్లతో కీలక ఒప్పందం!