E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో హిందుజా భారీ పెట్టుబడులు.. రూ. 20,000 కోట్లతో కీలక ఒప్పందం!

CM Chandrababu: ఏపీలో హిందుజా భారీ పెట్టుబడులు.. రూ. 20,000 కోట్లతో కీలక ఒప్పందం!
Advertisement

CM Chandrababu: లండన్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ కి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సఫలమయ్యారు. సోమవారం లండన్‌లో హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజాతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వారికి వివరించిన అనంతరం, రాష్ట్రంలో దశలవారీగా రూ. 20 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో హిందుజా గ్రూప్ అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకాలు చేసింది.

ఈ ఒప్పందంలో భాగంగా పలు కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. విశాఖలోని హిందూజా థర్మల్ ప్లాంట్ ప్రస్తుత 1,050 మెగావాట్ల సామర్ధ్యానికి అదనంగా, 800 మెగావాట్ల చొప్పున రెండు కొత్త యూనిట్లను స్థాపించి, మరో 1,600 మెగావాట్ల సామర్ధ్యాన్ని విస్తరించనుంది. రాయలసీమలో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.

Advertisement

ముఖ్యంగా, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాల తయారీ యూనిట్‌ను హిందుజా నెలకొల్పనుంది. దీనికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా తీసుకురానుంది. అనంతపురం, కర్నూలు, అమరావతిలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఏర్పాటును కూడా పరిశీలించనుంది.

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ పెట్టుబడులు కీలకం కానున్నాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పరిశ్రమలకు అత్యుత్తమ వాతావవరణం కల్పిస్తామని, హిందుజా ప్రతిపాదనలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రత్యేక ‘ఫాస్ట్-ట్రాక్ విండో’ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Advertisement

ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాలపై ముఖ్యమంత్రి దృష్టి

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్‌లో పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ రోల్స్ రాయిస్ గ్రూప్ ప్రతినిధులతో, అలాగే శ్రామ్ (SRAM), శామ్కో (SAMCO) హోల్డింగ్స్ అధినేతలతో కీలక చర్చలు జరిపారు.

ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రోల్స్ రాయిస్ సంస్థ సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) నిక్కీ గ్రేడీ స్మిత్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో అందుబాటులో ఉన్న వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం వారికి వివరించారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్ రిపెయిర్స్ ఓవర్ హాలింగ్ (MRO) యూనిట్ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను ప్రస్తావించారు.

భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకోసిస్టం, ఎమ్మార్వో ఫెసిలిటీ ఏర్పాటుకు గల అవకాశాలను కూడా వెల్లడించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని, విశాఖ, తిరుపతిలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రోల్స్ రాయిస్ ప్రతినిధులను కోరారు.

అనంతరం, SRAM & MRAM గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో సెమీ కండక్టర్స్ మరియు ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు SRAM & MRAM గ్రూప్ ఆసక్తి చూపింది. ఈ సంస్థలకు రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా సీఎం చంద్రబాబు వివరించారు.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×