Big Stories

Viral Video: ట్రక్ డ్రైవర్ వినూత్న ఆలోచన..వీడియో వైరల్

Viral Video: ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా జనం అల్లాడిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సమ్మర్ లో వాహనాలు నడిపే వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఓ డ్రైవర్ ఎండ వేడిమిని తగ్గించుకోవడానికి వినూత్న ఆలోచన చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

- Advertisement -

బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వారు ఎండ వేడిమి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా పనిచేసే వారు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఓ ట్రక్ డ్రైవర్
వెరైటీ ఆలోచన తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ఈ వీడియోలో ఎండలో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ సీటు ప్రక్కనే ఒక బకెట్ లో చల్లటి నీటిని ఉంచుకున్నాడు. అందులో ఓ మగ్ ఉంచి ఓ వైపు ట్రక్ నడుపుతూనే..మరో చేతితో నీటిని శరీరంపైన పోసుకుంటున్నాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 45 నుంచి 50 డిగ్రీల ఎండలో ట్రక్ నడిపించడం కష్టం అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

Also Read:చర్మ సౌందర్యానికి చెరుకు రసం ఎలా ఉపయోగపడుతుందో తెలుసా !

ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డ్రైవర్ తెలివి చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఇంకొందరు డ్రైవర్ ల పరిస్థితిపై సానుభూతి ప్రదర్శిస్తుంటే మరికొందరు గడ్కరీ కో బోల్నా పడేగా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News