Roti Spits Video: ప్రస్తుత బిజీ లైఫ్ లో బయటి ఫుడ్ కు తినడం ఎక్కువైంది. వర్క్ బిజీతో బయట ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే రెస్టారెంట్ లో ఆహారం తయారీపై ఓ అసహ్యమైన వీడియో వైరల్ అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లోని ఓ రెస్టారెంట్లలో రోటీలు తయారు చేసే వ్యక్తి వాటిపై ఉమ్మి వేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లు, చిన్న ఫుడ్ స్టాల్స్ లలో ఆహార పరిశుభ్రతపై మరోసారి సందేహాలు తలెత్తుతున్నాయి.
ఈ వీడియో ఘజియాబాద్లోని ఎ-వన్ చికెన్ పాయింట్ అనే రెస్టారెంట్ లో తీసిందని తెలుస్తోంది. ఈ ఫుటేజీలో ఓ వర్కర్ రోటీలను తయారు చేసి, వాటిపై ఉమ్మివేసి ఆ తర్వాత వాటిని కుంపటిలోపల కాలుస్తు్న్నాడు. వర్కర్ ను గమనించిన ఓ వ్యక్తి రహస్యంగా రికార్డు చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియో పోలీసులు దృష్టికి వెళ్లడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ghaziabad: If you order food from a hotel, then definitely check this out!
Once again, a case of spitting on roti has surfaced. After a video of a roti being spit on and placed in a tandoor went viral, a complaint was filed against a roadside hotel pic.twitter.com/ZinHZrra0C— J.BalVaibhav (@iambalvaibhav) January 9, 2026
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ లో ఆహార పదార్థాల తయారీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట తినడంపై అసహ్యం కలిగేలా ఈ వీడియో ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తు్న్నారు. మన దేశంలో ఆహార పరిశుభ్రత విషయంలో ఎప్పుడో రాజీపడిపోయామని మరికొందరు అంటున్నారు.
జనవరి 8న మధుబన్ బాపుధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ధమానపురం అవుట్పోస్ట్ దృష్టికి ఈ వీడియో వచ్చిందని ఏసీపీ సూర్యబలి మౌర్య తెలిపారు. ఈ క్లిప్లో రోటీల తయారు చేసే వ్యక్తి రోటీలపై ఉమ్మి వేస్తున్నట్లు ఉంది. ఈ వీడియోను పరిశీలించగా.. ఆరోపణలు వాస్తవమని తేలింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేశామని ఏసీపీ తెలిపారు.
Also Read: సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!
ఈ ఘటనతో రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ లో ఆహార పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఈ తరహా వీడియోలు వైరల్ అయ్యాయి. చట్నీ బల్లి, బిర్యానీలో బొద్దింక అంటూ నిత్యం ఏదొక చోట ఆహారం విషయంలో ఫిర్యాదులు వస్తూనే ఉంటున్నాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సమయంలో..ఒకటి రెండు రోజులు ఫుడ్ ఇన్ స్టెక్టర్లు హడావుడి చేస్తారని, ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోతారని నెటిజన్లు అంటున్నారు. ఫుడ్ ఇన్ స్టెక్టర్లు తరచుగా తనిఖీలు చేస్తే ఇలాంటి దారుణాలు తగ్గుతాయని ఆహార ప్రియులు కోరుతున్నారు.