Suspense Thriller OTT : థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమాలు, వెబ్ సిరీస్లను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటితరం ప్రేక్షకులు ప్రతి వారం కొత్ కొత్త కంటెంట్ కోసం వెతుకుతున్నారు.అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇందులో ‘మహారాజా’, ‘దృశ్యం’ వంటి సినిమాలను మించిన ట్విస్టులు ఉంటాయి ఇందులో. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
గత కొన్ని సంవత్సరాల నుంచి ట్విస్టులతో మైండ్ బెండయ్యే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ను తెగ అలరిస్తోంది మాలీవుడ్ ఇండస్ట్రి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కూడా మలయాళం థ్రిల్లరే. ఆ మూవీ పేరే “మీషా”(Meesha). IMDb లో 7.1 రేటింగ్ ఉన్న ఈ మూవీకి ఎమ్సీ జోసెఫ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మితున్ (కతీర్), ఆనందు (హక్కీమ్ షా), ఇమోధ్ (షైన్ టామ్ చాకో) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు కథిర్ మలయాళం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే ఆయనకు మొదటి మలయాళ సినిమా కాగా, ఇందులో కథిర్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మరొక కీలక పాత్రలో షైన్ టామ్ చాకో కన్పించగా, ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయి. 2025 ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : సినీయర్ అమ్మాయితో లవ్… ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ స్టోరీ… లవ్ లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్
ఈ సినిమా మొత్తం నాన్-లీనియర్ స్ట్రక్చర్లో ముందుకు సాగుతుంది. మిథున్ అనే వ్యక్తి ఫారెస్ట్ వార్డెన్ గా పని చేస్తాడు. ఆయన తన పాత స్నేహితులను కలవాలని ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగా రీయూనియన్ పేరుతో అందరికీ ఆహ్వానాలు పంపుతాడు. మొత్తం ఆరుగురు ఫ్రెండ్స్ ను పిలుస్తాడు. అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ లోనే పార్టీ ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ సడన్ ఇన్విటేషన్ తో వాళ్ళు కంగారు పడతారు. అయినా సరే ఫ్రెండ్ ని కలవడానికి వెళతారు. కానీ అక్కడికి వెళ్లాకే వాళ్ళకు అసలు విషయం అర్థం అవుతుంది. ఇప్పుడు కథ ఊహించని టర్న్ తీసుకుంటుంది. మరి ఈ సర్వైవల్ గేమ్ నుంచి వాళ్ళు బయట పడ్డారా ? అక్కడ పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ? అసలు ఆ ఫారెస్ట్ వార్డెన్ ఎందుకు ఫ్రెండ్స్ ను పిలిచాడు ? కేక పెట్టించే ఆ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాను గనక చూడకపోతే థ్రిల్లర్ మూవీ లవర్స్ ఒక మాస్టర్ పీస్ ను మిస్ అయినట్టే. కాబట్టి వెంటనే ఓ లుక్కేయండి.