Adulterated milk: తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరం లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూపనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నివాసితులు ఫిబ్రవరి 22 నుంచి వాంతులు, కడుపునొప్పి, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Lavanya Tripathi: రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న లావణ్య..మంచి పనే చేసిందంటూ!
ప్రస్తుతం మరో ఏడుగురు రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక ఎపిడెమియోలాజికల్ నివేదికల ప్రకారం పాలు కల్తీ కావడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ ఘటనపై పలు ప్రభుత్వ శాఖలు కలిసి విచారణను వేగవంతం చేశాయి. కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.