BigTV English
Advertisement

Seat Fight: సీటు కోసం లొల్లి.. ప్రభుత్వ టిచర్‌ను 25 మంది దారుణంగా కొట్టి..

Seat Fight: సీటు కోసం లొల్లి.. ప్రభుత్వ టిచర్‌ను 25 మంది దారుణంగా కొట్టి..

Seat Fight: బస్సులో సీటు విషయంలో జరిగిన గొడవ చివరకు కొట్లాటగా మారింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు రమేష్. పాఠశాల అనంతరం ఒంగోలులోని తన ఇంటికి వెళ్లేందుకు మద్దిపాడులో బస్సు ఎక్కాడు రమేష్. అయితే.. బస్సులో సీటు విషయంలో పక్కనే ఉన్న యువకులతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇది కాస్తా పెరిగి పెద్దదైంది.


బస్సులో సీటు విషయంలో జరిగిన గొడవ
దీంతో.. ఆ యువకులు వారి స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించారు. దీంతో.. ఒంగోలులోని పోతురాజు కాలువ వద్ద బస్సును ఆపి ఉపాధ్యాయుడిపై 20 మంది యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు రమేష్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

సీటు కోసం.. కోటి తిప్పలు
అసలు వివరాల్లోకి వెళితే.. కరిముల్ల అనే అటో డ్రైవర్ అద్దంకిలో ఒంగోలు రావడానికి బస్సు ఎక్కుతాడు. అయితే అదే క్రమంలో దొడ్డవరం అనే ఊరిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నటువంటి రమేష్ డ్యూటి ముగించుకోని సాయంత్రం సమయంలో అదే బస్సు ఎక్కుతాడు. బస్సులో కాలి లేని సమయంలో ఒకే సీటులో ఇద్దరు కూర్చోని ఉండగా.. మూడో వ్యక్తి అక్కడికి వెళ్లి జరగమనడం.. వాళ్లు జరగకపోవటం.. అదే సీటులో ఉన్న రమేష్ కూడా ఉంటాడు. అంతేకాకుండా కూర్చున్న సమయంలో ఒకరినొకరు నెట్టుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.


ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు మరికొందరు..
అయితే ఈ తోపులాటలో రమేష్ చేయ్యి.. కరిముల్ల అనే వ్యక్తి ముక్కుకు తాకడంతో అతనికి రక్తస్త్రావం అవుతుంది. దీంతో వెంటనే అతను తన స్నేహితులు, కొంత మంది అటో డ్రైవర్లకు ఫోన్ చేసి.. నాపై ఒక వ్యక్తి దాడి చేశాడని చెప్తాడు.. దీంతో బస్సు 15 నిమిషాలు అయితే ఒంగోలుకి రీచ్ అయ్యే సమయంలో ఒంగోల్ ఎంట్రన్స్ పోతురాజు కాలువ వద్ద అటోడ్రైవర్ ఫ్రేండ్స్ మొత్తం కలిసి బస్సును ఆపుతారు.

Also Read: గుడ్ న్యూ్స్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!

బస్సు ఆపి మరీ దాడి చేసిన విద్యార్థులు
దీని తర్వాత ఉపాధ్యాయుడిని బస్సులోనే పిడిగుద్దులతో దాడి చేస్తారు. దాడికి పాల్పడ్డ అనంతరం ఆ యువకులు 108 కి ఫోన్ చేసి కరిముల్లాని ఆసుపత్రికి తీసుకువెళతారు. మొదటగా కరిముల్ల స్నేహితులు పోలీసులకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తారు. అయితే దెబ్బలు తిన్నటువంటి రమేష్ కూడా జీజీహెచ్‌‌కి వెళ్లి అక్కడే చికిత్స పొందుతూ తాను ఫిర్యాదు చేస్తాడు. ఇరువర్గాల ఫిర్యాదుపై తాలుక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Pawan Kalyan: రోడ్లపై నిర్లక్ష్యం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్!

Big Stories

×