E-Paper
Advertisement

Simhachalam Temple: సింహాచలం ఆలయంలో వివాహాలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి

Simhachalam Temple: సింహాచలం ఆలయంలో వివాహాలు.. కొత్త రూల్స్ వచ్చేశాయి
Advertisement

Simhachalam Temple: చాలామంది భక్తులు దేవాలయాల్లో వివాహాలు చేసుకోవాలని భావిస్తుంటారు. అక్కడ పెళ్లి చేసుకుంటే దేవుడి అనుగ్రహం ఉంటుందని, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. సింహాచలం ఆలయంలో పెళ్లికి సిద్ధమవుతున్నారా? పాత పద్దతులను ఫాలో అయితే ఇబ్బందిపడినట్టే. వాటికి సంబంధించి కొత్త రూల్స్ వచ్చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మధ్యతరగతికి చెందినవారిలో చాలామంది దేవుడి కొండ మీద పెళ్లిళ్లు చేసుకోవాలని ఆరాట పడుతుంటారు. దేవుని సన్నిధిలో వివాహాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని వారి నమ్మకం. ముఖ్యంగా తిరుమల, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవాలయాలు ఏపీలో చాలానే ఉన్నాయి.

Advertisement

గతంలో సింహాచలం క్షేత్రంలో వివాహాలు చేసుకునే వారినుంచి గుత్తేదారులు భారీగా రుసుములు వసూలు చేసేవారు. అయితే పాత గుత్తేదారుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు వివాహాలకు నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఆగష్టు 1 నుంచి శుక్రవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్టు దేవాలయం ఈవో త్రినాథరావు వెల్లడించారు.

సింహగిరిపై గజపతి సత్రం, పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాలు, లోవ తోట వద్ద వివాహాలు చేసుకునేందుకు దేవస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తులకు అసౌకర్యం లేని ప్రాంతాలు కొండ దిగువన గుర్తించి ఈవో అనుమతితో వివాహాలు చేసుకోవచ్చు. పెళ్లి బృందం తొలుత రూ.10 వేలు జమ చేయాలి.

Advertisement

ALSO READ: సీటు కోసం లొల్లి.. టీచర్‌ను రెండు డజన్ల మంది కుమ్మేశారు

వివాహానికి నెల రోజుల ముందు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాలి. దేవస్థానం నుంచి విద్యుత్తు ఉపయోగించు కోవాలంటే ఆధారంగా ఛార్జీలుంటాయి. విద్యుత్తు దీపాలంకరణకు జనరేటర్‌ ఏర్పాటుకు అనుమతిస్తారు.  వివాహం ముగిసిన మూడు గంటల్లోగా అద్దెకు ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. దేవస్థానం నిర్వాహకులకు అప్పగించాలి.

పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అవసరాల రీత్యా రుసుం వసూలు చేయనున్నారు. ముందుగా 5 వేలు రూపాయలు డిపాజిట్‌ కట్టాలి. వివాహం తర్వాత వాటిని ఇచ్చేస్తారు. దేవస్థానం సూచించిన ప్రాంతాల్లో భక్తులు పెళ్లి మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే విద్యుత్తు దీపాలంకరణకు కూడా. మరిన్ని వివరాల కోసం సింహాచలం దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించాలి.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×