E-Paper
Advertisement

AP Elections: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే ?

AP Elections: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారి సంఖ్య ఎంతంటే ?
Advertisement

AP Elections 2024: ఏపీ వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ తెలిపారు. మే 4 నుంచి 9వ తేదీ వరకు పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని వెల్లడించారు.

ఆరు రోజుల పాటు జరిగిన ఓటింగ్ లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. అత్యల్పంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో 14,526 ఓట్లు పోలయ్యాయని అన్నారు. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు. తూర్పు గోదావరి, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ముకేశ్ కుమార్ తెలిపారు.

Advertisement

Also Read: ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ.. మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం చెప్పండి..

ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా 28 మోడల్ పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పల్నాడు జిల్లాతో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఈవో ఆఫీస్ తో పాటు అన్ని జిల్లాల్లోని కంట్రోల్ రూంల ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

 

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×