BigTV English
Advertisement

EC Letter to AP Govt: ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ.. మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం చెప్పండి..!

EC Letter to AP Govt: ఏపీ ప్రభుత్వానికి ఈసీ లేఖ.. మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం చెప్పండి..!

Election Commission Letter to AP Government about Treasury Details: ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. డీబీటీ నిధుల పంపిణీపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి.. ఈ ఒక్కరోజే నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. లబ్ధిదారులకు ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. జనవరిలో లబ్ధిదారులకు ఇచ్చేందుకు లేని నగదు.. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మధ్యాహ్నం 3 గంటల్లోగా చెప్పాలని ఈసీ లేఖలో కోరింది.


ఎన్నికలకు ముందు డీబీటీ నిధులను విడుదల చేస్తే ఓటర్లు ప్రలోభానికి గురవుతారని పేర్కొంటూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నకారణంగా నిధులను పంపిణీ చేయవద్దని ఈసీ ఆంక్షలు విధించింది. దానిపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ ఒక్కరోజు మాత్రమే నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. 11 నుంచి 13 వరకూ ఎలాంటి నిధులు విడుదల చేయవద్దని సూచించింది.

Also Read: జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ?


అలాగే.. డీబీటీ కింద నిధులు విడుదల చేసే పథకాలను ప్రచారంలో వాడొద్దని కండిషన్ పెట్టింది. ఆసరా, చేయూత, వసతి దీవెన, లా నేస్తం, రైతు భరోసా పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 59 నెలలుగా ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న విద్యార్థులు, మహిళలకు కాస్త ఊరట లభించిందని అనుకునేలోగానే ఈసీ ప్రభుత్వానికి రాసిన లేఖ సంచలనమైంది. దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×