E-Paper
Advertisement

75th constitution day celebrations: ఏపీలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు.. హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు

75th constitution day celebrations: ఏపీలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు.. హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు
Advertisement

75th constitution day celebrations: నేడు దేశ‌వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. 1950 న‌వంబ‌ర్ 26వ తేదీ నుండి రాజ్యాంగం అమ‌లులోకి రాగా నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా ఏపీలోనూ రాజ్యాంగ దినోత్స‌వ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో స‌చివాల‌యం ఐదో భ‌వ‌నంలో రాజ్యాంగ దినోత్స‌వ వేడుకల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు హాజ‌రుకానున్నారు. ఆయ‌న‌తో పాటూ ప‌లువురు, మంత్రులు సైతం వేడుక‌ల్లో పాల్గొంటారు.

వేడుక‌ల‌కు సంబంధించి సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి ఎస్. సురేశ్ కుమార్ అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, శాఖాధిప‌తులు, జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలిచ్చారు. అన్ని జిల్లాల్లో వేడుక‌లు నిర్వ‌హించాల‌ని సూచించారు. వేడుక‌ల్లో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హాలు, చిత్ర‌పటాల‌కు పూల మాల‌లు వేసి నివాళులు అర్పించ‌నున్నారు. కార్య‌క్ర‌మంలో అంద‌రితో రాజ్యాంగ పీఠిక‌ను చ‌దివించాల‌ని సీఎస్ సూచించారు. జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల స‌మ‌క్షంలో వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని చెప్పారు. అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని కార్య‌ద‌ర్శులు, శాఖాధిప‌తుల‌కు సూచించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×