Kakinada District: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ గ్రామాలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలోని మన్యం మండలంలోని సర్లంకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భయంకరమైన అగ్నిప్రమాదంలో దాదాపు 40 కుటుంబాల జీవితాలను తలకిందులు చేసింది. అసలు ఘటన ఎలా జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
సంక్రాంతి వేళ కాకినాడ జిల్లాలోని ఓ గ్రామంలో పెను విషాదం
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేళ పల్లెల్లో సందడి మొదలైంది. నగరాలు, పట్నాల నుంచి నుంచి ప్రజలు పల్లెలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం కారణంగా 40 కుటుంబాలకు గుండెకోత మిగిల్చింది. ఈ ఘటన కాకినాడ జిల్లా మన్యంలోని సార్లంకపల్లెలో రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఈ తండాలో దాదాపు 40 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఈ గ్రామానికి చెందిన కుటుంబాలు రోడ్డున పడ్డారు. మూడు ఇళ్లు మినహా అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. నిలువనీడ లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు బాధితులు. సంక్రాంతి పండుగ కోసం సరకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు సోమవారం సాయంత్రం తుని వెళ్లారు.
అగ్ని ప్రమాదానికి దగ్గమైన ఇళ్లు, రోడ్డున పడిన బాధితులు
ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా గ్రామంలో మంటలు చెలరేగి దావానంలా వ్యాపించాయి. ఊళ్లో కొద్దిమంది ప్రాణాలు చేత పట్టుకుని భయంతో పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బాధితులు తమ గ్రామానికి చేరుకునేసరికి సర్వం బూడిదైంది. ఆ ఇళ్లను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు గ్రామస్తులు.
సార్లంకపల్లె మారుమూల ప్రాంతంలో ఉంది. 50 కిలోమీటర్ల దూరంలోవున్న తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగింది. ఘటన గురించి తెలియగానే ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ఆ గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
ALSO READ: మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత
బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.