E-Paper
Advertisement

Kakinada District: సంక్రాంతి వేళ ఆ గ్రామంలో పెను విషాదం, మంటల్లో బూడిదైన పదుల సంఖ్యలో ఇళ్లు

Kakinada District: సంక్రాంతి వేళ ఆ గ్రామంలో పెను విషాదం, మంటల్లో బూడిదైన పదుల సంఖ్యలో ఇళ్లు
Advertisement

Kakinada District: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ గ్రామాలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలోని మన్యం మండలంలోని సర్లంకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భయంకరమైన అగ్నిప్రమాదంలో దాదాపు 40 కుటుంబాల జీవితాలను తలకిందులు చేసింది. అసలు ఘటన ఎలా జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

సంక్రాంతి వేళ కాకినాడ జిల్లాలోని ఓ గ్రామంలో పెను విషాదం

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేళ పల్లెల్లో సందడి మొదలైంది. నగరాలు, పట్నాల నుంచి నుంచి ప్రజలు పల్లెలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం కారణంగా 40 కుటుంబాలకు గుండెకోత మిగిల్చింది. ఈ ఘటన కాకినాడ జిల్లా మన్యంలోని సార్లంకపల్లెలో రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఈ తండాలో దాదాపు 40 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఈ గ్రామానికి చెందిన కుటుంబాలు రోడ్డున పడ్డారు. మూడు ఇళ్లు మినహా అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. నిలువనీడ లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు బాధితులు.  సంక్రాంతి పండుగ కోసం సరకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు సోమవారం సాయంత్రం తుని వెళ్లారు.

Advertisement

అగ్ని ప్రమాదానికి దగ్గమైన ఇళ్లు, రోడ్డున పడిన బాధితులు

ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా గ్రామంలో మంటలు చెలరేగి దావానంలా వ్యాపించాయి. ఊళ్లో కొద్దిమంది ప్రాణాలు చేత పట్టుకుని భయంతో పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బాధితులు తమ గ్రామానికి చేరుకునేసరికి సర్వం బూడిదైంది. ఆ ఇళ్లను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు గ్రామస్తులు.

సార్లంకపల్లె మారుమూల ప్రాంతంలో ఉంది. 50 కిలోమీటర్ల దూరంలోవున్న తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగింది. ఘటన గురించి తెలియగానే ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ఆ గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

ALSO READ:  మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ కన్నుమూత

బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×