E-Paper
Advertisement

Tiger Attack: యువకుడిపై పెద్దపులి దాడి కలకలం!

Tiger Attack: యువకుడిపై పెద్దపులి దాడి కలకలం!
Advertisement

Tiger Attack: ఈ మధ్య కాలంలో పెద్దపులి దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే నంద్యాల జిల్లాలో పెద్దపులి దాడి కలకలం రేపుతోంది. నల్లమల అడవులకు సమీపంలో ఉన్న సదరం పెంట చెంచుగూడానికి చెందిన ఓ యువకుడిపై దాడి పెద్దపులి చేసింది.

పొలానికి వెళ్లిన యువకుడిపై దాడి చేసిన పెద్దపులి

Advertisement

రోజులాగే యువకుడు పొలానికి వెళ్లాడు. ఆ రోజు పొలానికి మందు కొడతాం అని అనుకుని చూస్తుండగా.. అక్కడే పొదల చాటుగా ఉన్న పెద్దపులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో వెంటనే పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయిన కుదరక పోవడంతో.. గట్టిగ కేకలు పెట్టడంతో ఆ యువకుడి మామ అక్కడికి వచ్చాడు.

తీవ్ర గాయాలతో పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన యువకుడు
అలాగే అక్కడి ప్రజలు కూడా గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుండగా.. పులి అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు ఆ యువకుడి హమ్మయ్య బతికాను రా.. దేవుడా అని ఊపిరి పిల్చుకున్నాడు. పులి దాడిలో తీవ్ర యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడి సమీపంలోని ఆత్మకూరు ఆసుపత్రిలో బాధితుడిని చేర్చారు.

Advertisement

భయాందోళనలో గిరిజనులు..
ఈ ఘటనతో నల్లమల అడవుల సమీపంలోని గిరిజన గూడాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి దాడి కారణంగా స్థానికులు, ముఖ్యంగా గిరిజన సముదాయాలు, తమ రోజువారీ కార్యకలాపాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

Also Read: డేంజర్‌లో పాకిస్తాన్.. మునిగిన ప్రధాని ఇల్లు

జాగ్రత్తలు
స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అడవులకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకుండా ఉండాలని అటవీ శాఖ సూచిస్తుంది. అటవీ శాఖ అధికారులు పెద్దపులి కదలికలను పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×