Actress Namitha Campaign in Visakha(Political news in AP): ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ, ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు సిటీ నటి, బీజేపీ నాయకురాలు నమిత. ప్రధాని మోదీ చేసిన పనులే ఆ పార్టీని గెలుపిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సునాయాశమేనని మనసులోని మాట బయటపెట్టారు. మంగళవారం విశాఖలో పలు నియోజకవర్గాల్లో రోడ్ షో, ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహించారు.
విశాఖలో అడుగుపెట్టగానే బీజేపీ కార్యాలయానికి వెళ్లారు నటి నమిత. నేతలతో సమావేశం తర్వాత కార్యకర్తలతో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ముఖ్యంగా మహిళలతో మాట్లాడుతూ ఈసారి కూటమిదే గెలుపని వ్యాఖ్యానించారు. అలాగే గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి వంశీకృష్ణను గెలపించాలని మహిళలను అభ్యర్థించారు నటి నమిత.
భీమిలి నియోజకవర్గంలోని అమనాం, మజ్జివలన, మజ్జిపేట ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు నమిత. జనం భారీగా రావడంతో ఖుషీ అయ్యారు. గత ప్రభుత్వాన్ని చూశామని, పాలన ఎక్కడా కనిపించలేదన్నారు. ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నమిత.