E-Paper
Advertisement

Alluri district: తండ్రీకొడుకుల ప్రాణం తీసిన కోడిపుంజు.. నర్సింగ పేటలో తీవ్ర విషాదం!

Alluri district: తండ్రీకొడుకుల ప్రాణం తీసిన కోడిపుంజు.. నర్సింగ పేటలో తీవ్ర విషాదం!
Advertisement

Alluri district: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నర్సింగపేట గ్రామంలో ఒక చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. గ్రామ శివార్లలో ఉన్న ఒక చెరువు తండ్రీకొడుకుల పాలిట మృత్యుకుహరంగా మారింది. ఆదివారం నాడు జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా..  ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

స్థానికుల సమాచారం ప్రకారం.. మృతులు సింహద్రి పాపారావు, ఆయన కుమారుడు యశ్వంత్. గ్రామానికి సమీపంలోని చెరువు గట్టుపై ఉన్న తమ కోడి పుంజును పట్టుకోవడానికి వీరు ప్రయత్నించారు. ఆ సమయంలో కోడి పుంజును వెంబడిస్తుండగా ప్రమాదవశాత్తు ఒకరు నీటిలో పడిపోయారు. వారిని రక్షించే క్రమంలో మరొకరు కూడా నీటిలోకి దిగారు. దురదృష్టవశాత్తు ఆ చెరువు లోతుగా ఉండటంతో ఇద్దరికీ ఈత రాక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

చాలా సమయం వరకు వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే..  చెరువు గట్టుపై విడిచిన చెప్పులను చూసి స్థానికులకు అనుమానం కలిగింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యల కోసం రెస్క్యూ టీమ్ రప్పించారు. దాదాపు గంటల తరబడి గాలించిన తర్వాత తండ్రీకొడుకుల మృతదేహాలను బయటకు తీశారు.

నిన్న మొన్నటి వరకు కళ్లముందే తిరిగిన తండ్రీకొడుకులు ఇలా విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఒక కోడి పుంజు కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

Advertisement

ALSO READ: Sangareddy Crime: పెళ్లి పేరుతో యువతి ఉసురు తీశాడు.. ప్రియుడి ఇంటిముందు మృతదేహంతో బంధువుల ధర్నా!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×