E-Paper
Advertisement

Alluri district: తండ్రీకొడుకుల ప్రాణం తీసిన కోడిపుంజు.. నర్సింగ పేటలో తీవ్ర విషాదం!

Alluri district: తండ్రీకొడుకుల ప్రాణం తీసిన కోడిపుంజు.. నర్సింగ పేటలో తీవ్ర విషాదం!
Advertisement

Alluri district: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నర్సింగపేట గ్రామంలో ఒక చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. గ్రామ శివార్లలో ఉన్న ఒక చెరువు తండ్రీకొడుకుల పాలిట మృత్యుకుహరంగా మారింది. ఆదివారం నాడు జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా..  ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

స్థానికుల సమాచారం ప్రకారం.. మృతులు సింహద్రి పాపారావు, ఆయన కుమారుడు యశ్వంత్. గ్రామానికి సమీపంలోని చెరువు గట్టుపై ఉన్న తమ కోడి పుంజును పట్టుకోవడానికి వీరు ప్రయత్నించారు. ఆ సమయంలో కోడి పుంజును వెంబడిస్తుండగా ప్రమాదవశాత్తు ఒకరు నీటిలో పడిపోయారు. వారిని రక్షించే క్రమంలో మరొకరు కూడా నీటిలోకి దిగారు. దురదృష్టవశాత్తు ఆ చెరువు లోతుగా ఉండటంతో ఇద్దరికీ ఈత రాక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

చాలా సమయం వరకు వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే..  చెరువు గట్టుపై విడిచిన చెప్పులను చూసి స్థానికులకు అనుమానం కలిగింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యల కోసం రెస్క్యూ టీమ్ రప్పించారు. దాదాపు గంటల తరబడి గాలించిన తర్వాత తండ్రీకొడుకుల మృతదేహాలను బయటకు తీశారు.

నిన్న మొన్నటి వరకు కళ్లముందే తిరిగిన తండ్రీకొడుకులు ఇలా విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఒక కోడి పుంజు కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం అందరినీ కలిచివేస్తోంది.

Advertisement

ALSO READ: Sangareddy Crime: పెళ్లి పేరుతో యువతి ఉసురు తీశాడు.. ప్రియుడి ఇంటిముందు మృతదేహంతో బంధువుల ధర్నా!

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×