E-Paper
Advertisement

Ambati Rambabu: వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే

Ambati Rambabu: వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు న్యాయస్థానం. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు. ఆయన బెయిల్ కోసం వైసీపీ లీగల్ టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిపై న్యాయస్థానంలో పిటిషన్ వేయనుంది.

రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటిరాంబాబు

గుంటూరు పట్టణంలో తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై మహాపాపం పేరుతో టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను 24 గంటల్లో ఫ్లెక్సీ తొలగించాలని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ వ్యవహారంపై శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అంబటి వాహనాన్ని అడ్డుకున్నారు.

ఊహించని పరిణామంతో షాకైన అంబటి, కారులో నుంచే సీఎం చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ శ్రేణులు అంంబటి కారుపై దాడి చేశాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్లాలని పోలీసులు అంబటిని సూచించినా వినిపించుకోలేదు. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు.

అసభ్యకర వ్యాఖ్యలు కేసు.. రెండువారాల రిమాండ్

ఈ వ్యవహారంపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గుంటూరు సిద్ధార్థనగర్‌లో అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడులు చేశారు, నిప్పుపెట్టారు.  చివరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంబటిపై వివిధ పోలీసుస్టేషన్‌లో పీఎస్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారించిన తర్వాత ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన్ని గుంటూరు సివిల్ న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ముందు ఇరుపక్షాల వాదనలు జరిగాయి.

ALSO READ: ఆ నిప్పు మీ ప్రభుత్వానికే పెట్టుకున్నారు.. ఏపీలో నడుస్తోంది జంగిల్‌ రాజ్.. 

అంబటి తరపున పొన్నవోలు తన వాదనలు వినిపించారు. అంబటి రాంబాబు ఎలాంటి నేరం చేయలేదన్నారు. ఆయనపై నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నందున ఆయనకు రిమాండ్ విధించవద్దని కోరారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 కేసులు నమోదు అయ్యాయని, వాటిలో మాగ్జిమమ్ కేసులు అసభ్యకర వ్యాఖ్యలు, పోలీసు విధులకు ఆటంకం కలిగించినవేనని పోలీసుల తరపు న్యాయవాదులు తెలిపారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబటిని విడుదల చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని వివరించారు. ఆయన్ని పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని, రిమాండ్ విధించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 14 రోజులపాటు ఆయనకు రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపాలని అంబటి కోరడంతో న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చివరకు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×