E-Paper
Advertisement

Ambati Rambabu: దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం.. వెంకన్న కోపాగ్నికి చంద్రబాబు బలికాక తప్పదు!

Ambati Rambabu: దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం.. వెంకన్న కోపాగ్నికి చంద్రబాబు బలికాక తప్పదు!
Advertisement

Ambati Rambabu: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన ఇల్లు.. ఆఫీసుపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. సుమారు ఏడు గంటల పాటు దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా ఎస్పీకి సమాచారం అందించినా కనీసం పట్టించుకోలేదని అంబటి విమర్శించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని.. కానీ పోలీసులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు పోలీసులను ఏవిధంగా వినియోగిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని.. పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ పరిస్థితులపై ఆలోచించాలని కోరారు. తన అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ.. సీపీఐ.. జనసేన నాయకులు స్పందించి ఖండించినప్పటికీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని అంబటి తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైన తర్వాత కూడా ఇంకా దుష్ప్రచారం చేయడం దేనికని ప్రశ్నించారు. వాస్తవాలను దాచిపెట్టి భగవంతుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం వల్ల చంద్రబాబు నాయుడు స్వామివారి కోపాగ్నికి బలికాక తప్పదని హెచ్చరించారు. దైవ కార్యాల్లో రాజకీయ జోక్యం సరికాదని హితవు పలికారు.

రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైందని.. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసు అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించకుండా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలందరూ ఏకమై ఇలాంటి అరాచక పాలనను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: Boggula Srinivas Murder: పవన్ కళ్యాణ్ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి.. మిస్ట‌రీ వీడింది!

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×