E-Paper
Advertisement

Amit Shah : విశాఖలో బీజేపీ సభ.. టార్గెట్ జగన్.. అమిత్ షా ఘాటు విమర్శలు..

Amit Shah :  విశాఖలో బీజేపీ సభ.. టార్గెట్ జగన్.. అమిత్ షా ఘాటు విమర్శలు..
Advertisement

Amit Shah news latest(Political news in AP): విశాఖలో బీజేపీ మహా సంపర్క అభియాన్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. 9 ఏళ్ల మోదీ పాలనలో సాధించిన విజయాలను వివరించారు. మోదీ ప్రధాని అయ్యాక సైనిక బలం పెరిగిందన్నారు. పుల్వామా ఘటనకు 10 రోజుల్లో సమాధానం చెప్పామని తెలిపారు. సర్జరికల్ స్ట్రైక్ తో పాక్ కు బుద్ధి చెప్పామన్నారు. మోదీ పాలనలో అవినీతి జరగలేదని తెలిపారు. యూపీఏ హయాంలో అన్ని కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. ఆ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్లు దోచుకున్నారని అమిత్ షా ఆరోపించారు.

Advertisement

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటోందని కానీ నాలుగేళ్ల లో అవినీతి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అమిత్ షా విమర్శించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానంలో ఏపీ ఉందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన డబ్బులనే రైతుభరోసా పేరుతో సీఎం జగన్ పంచుతున్నారని చెప్పారు. ఇందుకు జగన్ సిగ్గపడాలని మండిపడ్డారు.

రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం కేంద్రం ఇచ్చినవేనని అమిత్ షా తెలిపారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం పథకంపై జగన్ తన ఫోటో పెట్టుకున్నారని విమర్శించారు. 2024లో మోదీ మళ్లీ ప్రధాని అయ్యేందుకు ఏపీ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. 20 ఎంపీ సీట్లు గెలిపించాలని ఓటర్లను కోరారు.

Advertisement

Related News

పెళ్లైన వారానికే.. సినిమా వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

Big Stories

Advertisement
×