E-Paper
Advertisement

Amit shah: ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ వస్తేనే అభివృద్ధి: అమిత్ షా

Amit shah: ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ వస్తేనే అభివృద్ధి: అమిత్ షా

Amit shah: ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా మాట్లాడారు. ఏపీలో గుండాగిరిని రూపు మాపేందుకే టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని పేర్కొన్నారు. అవినీతి వైసీపీని గద్దె దించతామని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పరిటాల సునీత పలువురు కూటమి ముఖ్య నేతలు సభకు హాజరయ్యారు.అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే కూటమి ఏర్పడిందని అమిత్ షా అన్నారు. ఏపీలో భూ మాఫియాను అంతం చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఉన్నంత కాలం తెలుగు భాషను కాపాడుతాం అని తెలిపారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. జగన్ అవినీతిలో కూరుకు పోయి ప్రాజెక్టును ఆలస్యం చేశారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు వస్తేనే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందని పేర్కొన్నారు.

ఇండియా కూటమిపై షా తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ వీరిలో ఎవరో చెప్పాలని అన్నారు. అసలు కూటమికి అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. మరో సారి మోదీనే దేశ ప్రధాని అని అమిత్ షా అన్నారు. దేశాన్ని రక్షించడంతో పాటు ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు మోదీ ప్రధాని కావాలన్నారు.

Also Read:ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు: చంద్రబాబు

ఉమ్మడి ఏపీలో చంద్రబాబును ప్రజలు ప్రథమ స్థానంలో ఉంచారన్న ఆయన చంద్రబాబు హయాంలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందిదని అన్నారు. కానీ..జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని ఆరోపించారు. జగన్ మద్యపాన నిషేదం చేస్తానని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వస్తే  రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. 25 ఎంపీ స్థానాల్లో కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×